Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరానికి బెయిలు మంజూరు అయినప్పటికీ ఈ నెల 24 వరకు ఈడీ కస్టడీలోనే ఉండే అవకాశమున్నది.
అయితే సీబీఐ కేసు విచారణలో భాగంగా.. ఇతర కేసుల్లో అరెస్టు కానిపక్షంలో ఆయనను లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చునని కోర్టు తెలిపింది. అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలనే షరతు విధించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ శుక్రవారం ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు మరో 13 మందిని సీబీఐ నిందితులుగా పేర్కొంది.