Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖరీఫ్ పంటలు రైతు చేతికొచ్చే సమయం ఆసన్నమైందనీ, ధాన్యం కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ, సహకారశాఖ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. తేమ తనిఖీ యంత్రాలకు మరమ్మతులు చేయించాలని సూచించారు. ఈమేరకు బుధవారం ఉన్నతాధికారులతో మంత్రి పంట కొనుగోళ్లపై సమీక్షించారు. వెంటనే ధాన్యం శుద్దిచేసే యంత్రాలు సిద్దం చేయాలన్నారు. ధన్యానికి సరిపడినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతోపాటు నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల వద్ద ఏ సమయం నుంచి పత్తి కొనుగోళ్ళు ప్రారంభి స్తామో, ఏ సమయం వరకు ముగిస్తామమో రైతులకు స్పష్టంగా తెలియ జేసేలా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిగినన్ని రోజులూ సిబ్బందికి సెలవులు రద్దు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారది, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.