Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు ఏడు... ఏపీకి 13 పురస్కారాలు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు రాష్ట్రాల్లోని పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్లలో అత్యుత్తమ సేవలు, శానిటేషన్ నిర్వహణ, డ్రయినేజీ తదితర అంశాల్లో కేంద్ర పంచాయతీరాజ్ అవార్డులు లభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి మొత్తం 20 అవార్డులు వచ్చినట్టు సంబంధిత శాఖాధికారులు తెలిపారు. 2019 సంవత్సరానికిగానూ ఉత్తమ పనితీరు కనబర్చిన మండలాలు, జిల్లా పరిషత్లు ఈ అవార్డులను పొందాయి. తెలంగాణకు ఏడు అవార్డులు రాగా, ఆంధ్రప్రదేశ్కు 13 జాతీయ పంచాయతీ పురస్కారాలు వరించాయి. బుధవారం ఢిల్లీలోని పుసా వ్యవసాయ అధ్యయన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. జనరల్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లాలోని మంథని, జగిత్యాలలోని వెల్గటూర్ మండల పంచాయతీలకు దీన్ దయాల్ ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డులు వచ్చాయి. శానిటేషన్ విభాగంలో మెదక్ జిల్లా మల్కాపూర్, పెద్దపల్లి జిల్లా మల్లారం గ్రామ పంచాయితీలు పురస్కారాలను పొందాయి. సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ విభాగంలో సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామ పంచాయితీకి ప్రత్యేక పురస్కారం లభించింది. జనరల్ విభాగంలో నిజామాబాద్ జిల్లా నాగపూర్ గ్రామ పంచాయితీ, పెద్దపల్లి జిల్లా రాఘవపూర్కు నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం సైతం లభించింది. జగిత్యాల జిల్లా పడిమడుగు గ్రామ పంచాయతీకి చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంది.