Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకాశం జిల్లా నాయకుల భేటీలో పవన్ కల్యాణ్
అమరావతి : సీఎం మీద కేసులుంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడతారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేసులున్న సీఎంకు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ధైర్యం చాలదని, సీఎం ఢిల్లీ పర్యనటలో ఇదే జరిగిందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు.
కేంద్ర మంత్రుల దగ్గర రాష్ట్ర ప్రాజెక్టుల గురించి సీఎం బలంగా మాట్లాడలేకపోయారని, మాట్లాడితే సిబిఐ కేసులు బయటకు తీస్తారన్న భయం ఉందని అన్నారు.భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న విశాఖలో లాంగ్మార్చ్ నిర్వహిస్తున్నా మన్నారు.
పార్టీ నుంచి వెళ్లే వారిని వెళ్లిపోనివ్వాలని, విశాఖ లాంగ్మార్చ్ పోస్టర్ను పవన్కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.