Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: దేశంలో ఆందోళనలు, హింసాత్మక చర్యలు, మూకదాడులు పెరుగుతున్నాయనీ, వాటితో దేశ సామరస్యానికి ప్రమాదం వాటిల్లితుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బుధవారం ''నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్''లో జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న హింసాత్మక చర్యల వల్ల దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదముందని హెచ్చరించారు. అన్ని సమస్యలపై సహేతుకంగా వ్యవహరించాలనీ, ప్రజాస్వామ్యానికి శాంతియుత చర్చలే పునాదని తెలిపారు.