Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే..
- నాగాలాండ్ సర్కారు సంచలన నిర్ణయం
కోహిమా : ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసే ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని నాగాలాండ్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ టెంజెన్ టారు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సర్కారు పాలసీలు, చేస్తున్న పనులపై ప్రభుత్వ ఉద్యోగులెవరైనా విమర్శలు చేసినా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. మీడియాలో మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇది నాగాలాండ్ గవర్నమెంట్ సర్వెంట్ కండక్ట్ రూల్స్ 1968, నిబంధన 22ను అతిక్రమించడమేనని అన్నారు. నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్)తో చర్చలు సాధ్యం కావని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. తమకు ప్రత్యేక జెండా, రాజ్యాంగం కావాలని ఎన్ఎస్సీఎన్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆందోళనకారులు తుపాకులు వదిలితే గానీ చర్చలు జరిపే ప్రసక్తే లేదని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. ఈ నెల 31న వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇదిలాఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులెవరూ సెలవులు పెట్టడానికి, స్థానచలనం (ట్రాన్స్ఫర్స్) చెందడానికి వీల్లేదని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.