Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రస్థానంలో అసోం
- ఎన్సీఆర్బీ నివేదిక
న్యూఢిల్లీ : దేశద్రోహం కేసుల్లో అసోం అగ్రస్థానంలో వున్నది. హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఒడిషా, తమిళనాడు తర్వాత స్థానాల్లో నిలిచాయి. 2016తో పోలిస్తే 2017లో దేశద్రోహం కేసులు 45శాతం పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదలచేసిన నివేదిక పేర్కొంది. 2016లో 35కేసులు నమోదుకాగా, 2017లో వీటి సంఖ్య 51కి చేరింది. వీటికి సంబంధించి 2016లో 48 మందిని అరెస్టుచేయగా, 2017లో 228మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలి స్థానంలో వున్న అసోంలో 2016లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. కాగా, 2017లో 19 కేసులు నమోదయ్యాయి. హర్యానాలో 13 కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన 228మందిలో ముగ్గురు మైనర్లు, తొమ్మిదిమంది మహిళలు ఉండటం గమనార్హం. దేశద్రోహం చట్టంపై పునరాలోచించాలని లా కమిషన్ గతేడాది సిఫారసు చేయగా.. కేంద్ర హౌం శాఖ అందుకు తిరస్కరించింది. 'దేశద్రోహం చట్టాన్ని రద్దుచేసే ప్రతిపాదన ఏదీలేదు. దేశ వ్యతిరేక, వేర్పాటువాద, ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే అందులోని నిబంధనలను నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది' అని కేంద్ర హౌం మంత్రి రాజ్యసభలో ఇటీవల ప్రకటించారు. గత సాధారణ ఎన్నికల్లో దేశద్రోహం చట్టంపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. తాము అధికారంలోకి వస్తే దేశద్రోహం చట్టాన్ని రద్దుచేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. దీనిపై స్వయంగా బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఐదేండ్లలో 17శాతం పెరిగిన ఖైదీలు
ఒకవైపు నేరాలు పెరుగుతుంటే.. మరోవైపు ఖైదీలూ పెరుగుతున్నారు. దీంతో జైళ్లన్నీ ఇరుకుకూపాలుగా మారు తున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. 2012లో ఖైదీల సంఖ్య 3,85,135 వుండగా, 2017 నాటికి అది 4,50, 696కు చేరింది. అంటే దాదాపు 17 శాతం పెరిగింది. ఖైదీల పెరుగుదలలో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ది అగ్రస్థానం. వంద మందికి వసతి కల్పించే స్థలంలో 165 మంది ఖైదీలను ఇరికిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఛత్తీస ్గఢ్ (157.2 సగటు), ఢిల్లీ (151.2 సగటు)లు ఉన్నాయి. సగటును మించి ఖైదీలను ఉంచటంతో అవి మురిక ికూపాలుగా మారుతున్నాయి. వెరసి ఖైదీల అనారోగ్యానికి దారితీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
25 విభాగాల్లో డేటా మిస్సింగ్ వెనుక
దేశంలో 2017లో జరిగిన వివిధ రకాల నేరాల గురించి సమాచారాన్ని సేకరించి, వాటిసవిభాగాల సమాచారం మిస్సయ్యింది. 2018లోనే విడుదల చేయాల్సిన ఈ డేటాను దాదాపు ఏడాదిన్నర ఆలస్యంగా విడుదల చేయడానికి కారణం ఏమిటో వివరించలేదు. అలాగే అన్ని విభాగాల్లో డేటాను వెల్లడించలేదు. దీనివెనుక 'పెద్దల' హస్తమున్నదని, కావాలనే గణాంకాలను దాచిపెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో చోటు చేసుకున్న మూక హత్యలు, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు చేసిన లేదా చేయించిన హత్యల వివరాలు, ఆర్టీఐ కార్యకర్తలపై దాడులు, హత్యలు, కాపు పంచాయతీల హత్యలు, మత ఘర్షణల్లో చనిపోయిన వారికి సంబంధించిన గణాంకాలను ఎన్సీఆర్బీ వెల్లడించలేదు. వీటికి సంబంధించిన గణాంకాలను సేకరించామనీ, వాటిని ఎందుకు నిలిపివేశారో ఉన్నతాధికారులకే తెలియాలని ఎన్సీఆర్బీలో కింది స్థాయి అధికారి ఒకరు తెలిపారు. కీలకమైన పలు నేరాలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవటం వెనుక కేంద్ర సర్కార్ హస్తముందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.