Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ
న్యూఢిల్లీ : రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు వెల్లడించింది. పెట్రోలు, డీజిల్ రిటైల్ మార్కెట్లో కొత్త కంపెనీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. గోధుమలు, పప్పులు, కాయధాన్యాలు, ఆవాలు...తదితర ఉత్పత్తులు త్వరలోనే మార్కెట్కు రాబోతున్న తరుణంలో మద్దతు ధర పెంపు రైతులకు మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోంది. పంటను బట్టి ఎంఎస్పీని 50 శాతం నుంచి 109 శాతం వరకు పెంచామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. మంత్రివర్గ నిర్ణయాలను ఆయన మీడి యాకు వెల్లడించారు. గోధుమల మద్దతు ధర క్వింటాలుకు రూ.85 పెంచినట్టు తెలిపారు. పప్పులు, బార్లీ, కాయధాన్యాలు, ఆవాలు..తదితర ఉత్పత్తుల మద్దతు ధరలను క్వింటాలుకు 50 శాతం నుంచి 109 శాతం వరకు పెంచామన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో మరొకటి ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ. వచ్చే ఏడాది ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని అనధికారిక కాలనీల్లో నివసించే 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించబోతున్నామని కేంద్ర మంత్రి అన్నారు.