Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ జవాను మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పళ్లాన్వాలా సెక్టార్ వద్దనున్న నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ జవాను అమరుడవగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. సైనిక బృందాలు ఆర్మీ ట్రక్లో ప్రయాణిస్తుండగా, ఈ పేలుడు సంభవించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఉదంపూర్లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఇదిలా వుండగా, పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. రాజౌరి జిల్లా.. నౌషెరా సెక్టార్ వద్దనున్న ఎల్వోసీ సమీపంలో.. సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. కాగా, పాక్ కాల్పులను భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది.