Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ
- హాజరైన ప్రధాని మోడీ, మంత్రులు, ఇతర పార్టీల లీడర్లు
- ఆమోదం కోసం 40 బిల్లులు సిద్ధం
- ఆర్థిక తిరోగమనం, నిరుద్యోగంపై చర్చకు ప్రతిపక్షం పట్టు
- 250కు చేరుకున్న రాజ్యసభ సమావేశాలు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (నేటి నుంచి) నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 13 (శుక్రవారం) వరకు 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. సమావేశాల నిర్వహణకు సంబంధించి ఆదివారం కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ప్రధాని మోడీతో పాటు మంత్రులు, ఇతర పార్టీల ఫ్లోర్లీడర్లు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో సుమారు 40 బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సంసిద్ధమవుతోంది. ఆర్థిక తిరోగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో ఆదివారం అఖిల పక్ష సమావేశం జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు థావర్ చంద్ గెహ్లాట్, అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్, రామ్దాస్ అథావలే (ఆర్పీఐ), గులాం నబీ ఆజాద్, అధిర్ అంజన్ చౌదరి, ఆనంద్ శర్మ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), సుదీప్ బందోపాధ్యయ, డెరిక్ ఒబ్రెయిన్ (టీిఎంసీి), వి.విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి (వైసీపీ), టికె రంగరాజన్, పిఆర్ నటరాజన్ (సీపీఐ(ఎం)), గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), ప్రసన్న ఆచార్య (బీజేడీ), సతీష్ చంద్ర మిశ్రా, దానిష్ అలీ (బిఎస్పీ), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), మనోజ్ కమార్ ఝా (ఆర్జేడీ), సంజరు సింగ్ (ఆప్), బినరు విశ్వం (సీపీఐ), ఎన్.కె ప్రేమ్చంద్రన్ (ఆరెస్పీ), వినాయక్ రౌత్ (శివసేన), హసనైన్ మసూది (నేషనల్ కాన్ఫెరెన్స్), జోషి కె. మణి (కేరళ కాంగ్రెస్(ఎం)), వైకో (ఏండీఎంకెే), అసదుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), సుఖ్బీర్ సింగ్ బాదల్ (ఎస్ఏడీ), నవనీత్ కృష్ణన్, రవీంద్రనాథ్ కుమార్ (అన్నాడీఎంకే), అనుప్రియ పటేల్ (అప్నాదల్) తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు వివిధ అంశాలను లేవనెత్తారు. ఆయా అంశాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని స్పష్టం చేశారు.
రాజ్యసభ 250వ సమావేశాలు ప్రత్యేకం: మోడీ
అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ''ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే ప్రస్తుత సమావేశాలు రాజ్యసభకు 250 సెషన్ అవుతుంది'' అని తెలిపారు. భారతదేశం వంటి విభిన్న ధృవాల గల దేశానికి పాలన సంస్థల విస్తృతమైన విధానాన్ని అందిం చడంలో పార్లమెంట్తో పాటు రాజ్యాంగం ప్రత్యేకతను ఎత్తిచూపడానికి రాజ్యసభ 250వ సెషన్ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించిందని చెప్పారు. మహాత్మగాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న నేపథ్యంలో రాజ్యసభ 250వ సెషన్ రావడం ప్రత్యేకమైన సందర్భమని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన నిర్ధిష్ట సమస్యలపై ప్రధాని స్పందిస్తూ పెండింగ్లో ఉన్న బిల్లులు, కాలుష్యం, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయరంగం, రైతులు, మహిళలు, యువత, సమాజంలో అణగారిన వర్గాలకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి నిర్మాణాత్మకంగా పని చేస్తుందని అన్నారు. గత సమావేశాలు విజయవంతంగా జరిగాయని, ఇది ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలలో సానుకూల ప్రభావాన్ని కలిగించడానికి దోహదపడిందని తెలిపారు.
ప్రతిపక్షాల సహకారం అవసరం: ప్రహ్లాద్ జోషి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లా డుతూ నిబంధనల ప్రకారం అనుమతించిన ఏ సమస్య పైనైనా పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించేందుకు ప్రభు త్వం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకా రం అందించాలని కోరారు. రాజ్యాంగం ఆమోదించి 70 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో నవంబర్ 26న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
బిల్లుల ఆమోదానికి సర్కారు ఆతృత
పెండింగ్ బిల్లులు ఆమోదంతో పాటు, కొన్ని కొత్త బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిటిజన్ షిప్ సవరణ బిల్లు, పన్నులు చట్టాల సవరణ బిల్లు, ఇన్సోల్వెన్సీ, బ్యాంక్రుపిసీ రెండో సవరణ బిల్లు, నేషనల్ పాలసీ యూనివర్శిటీ బిల్లు, వ్యక్తిగత సమాచార భద్రతా బిల్లు వంటి ముఖ్యమైన 27 బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం కోసం ప్రభుత్వం యోచిస్తోంది. వీటితో పాటు రాజ్యసభలో ఆమోదం పొంది, లోక్సభలో పెండింగ్లో ఉన్న నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్ (సవరణ) బిల్లు-2019ను ఈసారి కచ్చితంగా ఆమోదించుకోవాలని యోచిస్తోంది. లోక్సభలో పెండింగ్లో చిట్ఫండ్స్ (సవరణ) బిల్లు-2019ను ఆమోదం కోసం నిర్ణయించింది. లోక్సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్లో ఉన్న సరోగసీ, అంతరాష్ట్ర జలాల వివాదం, డ్యాం సేఫ్టీ, ట్రాన్స్జెండర్ హక్కులు, జలియన్వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ బిల్లులను, రాజ్యసభలో పెండింగ్లో ఉన్న మరో ఐదు బిల్లులను ఆమోదం కోసం ప్రభుత్వం యత్నిస్తుంది.