Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బదిలీలు, సస్పెన్షన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్
గుంటూరు : ఎలుకలు కొరికి పసికందు మృతిచెందిన ఘటనలో బాధ్యులను చేస్తూ ఇద్దరు నర్సులతోపాటు హెచ్ఒడి భాస్కరరావును బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ జిజిహెచ్ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నల్ల రిబ్బన్లతో ఆస్పత్రి ఎదుట శనివారం నిరసన తెలిపారు. శిశువు సరైన వైద్యం అందక మరణించలేదని, నిర్వహణా లోపాల వల్లే ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు వైద్యులు, నర్సులను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఆస్పత్రిలో 600 మంది నర్సులు అవసరం కాగా 180 మందే ఉన్నారని, చాలామంది రిటైరవుతున్నా ఖాళీలను భర్తీ చేయడంలేదన్నారు. ఐదు వార్డులను ఒకే నర్సు చూసుకోవాల్సి వస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై మంత్రి కామినేని శ్రీనివాసరావు, కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు.