Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్యూరిచ్: ఆయుధాల ఒప్పందంలో తమ అధికారులకు లంచం ఇచ్చిన రెండు కంపెనీలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవా ల్సిందిగా భారత్ చేసిన విన్నపాన్ని స్విట్జర్లాండ్ తిరస్కరించింది. సంబంధిత విషయంపై అంత ర్జాతీయ చట్టాల ప్రకారమే సమాచారాన్ని అభ్యర్థించినప్పటికి ప్రస్తుతం ఆ దేశం అందించే స్థితిలో లేదని ఆటార్ని జనరల్ ఆఫీసుకు చెందిన అధికారి ఒకరు మీడియా తెలిపారు. భారత అధికారులు కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించి ఉంటే స్విస్ ఖచ్చితంగా సమాచారం ఇచ్చి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2012లో ఇండియా స్విస్ కేంద్రంగా పనిచేసే ఆయుధాల కంపెనీని అధికారులకు లంచం ఇచ్చినందున వ్యాపార కార్యకలాపాలు కొనసాగించకుండా బ్లాక్లిస్టులో పెట్టింది.