Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాకు ఎలాంటి సమాచారమూ లేదు : కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : సీఏఏను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో కేంద్ర హౌం మంత్రి అమిత్ షాతో చర్చించడానికి ఆయన ఇంటికి షాహీన్బాగ్ నిరసన కారులు నేడు(ఆదివారం) మార్చ్ను చేపట్టనున్నారు. పలు డిమాండ్లతో ఈ ర్యాలీని చేపడుతున్నామనీ, అందులో సీఏఏ రద్దు డిమాండ్ ప్రధానమైనదని నిరసనకారులు తెలిపారు. అయితే అమిత్షాతో షాహీన్బాగ్ నిరసనకారుల సమావేశానికి సంబంధించి ఇప్పటి వరకు తమకెలాంటి సమాచారమూ లేదని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అమిత్ షా ఇంటికి నిరసనకారుల మార్చ్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ''సీఏఏతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. దానిపై వారితో నేను చర్చిస్తానని ఇటీవల అమిత్ షా ప్రకటన చేశారు. పౌరసత్వ చట్టంతో మాకు సమస్య ఉంది. అందుకే అమిత్ షా ఇంటికి వెళ్లి ఆయనను కలవాలని మేము నిర్ణయించుకున్నాం'' అని షాహీన్బాగ్ నిరసనకారులు తెలిపారు. కేంద్ర మంత్రితో సమావేశానికి ప్రతినిధి బృందాన్ని పంపబోమనీ, తామే నేరుగా వెళ్లి కలుస్తామని చెప్పారు.