Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది ఐటీ ఉద్యోగులు మృతి
బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ఐటీ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. 31 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. మైసూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోన్న 40 మంది ఉద్యోగులతో కూడిన డీబీ ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు ఉత్తర కర్నాటక పర్యటనలో భాగంగా మంగళూరుకు బయలుదేరింది. మంగళూరు బీచ్ నుంచి ఉడుపికి వెళ్లాలనేది వారి ప్రణాళిక. ఈ క్రమంలోనే మైసూరు నుంచి బయలుదేరిన బస్సు కర్కల సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పింది. కుడి వైపున ఉన్న కొండను ఢ కొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో కుడి వైపు బస్సు మొత్తం నుజ్జునుజ్జయింది. కుడివైపున కూర్చున్న ప్రయాణికులందరూ మరణించారు. తొమ్మిది మంది ఘటనాస్థలంలోనే చనిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఆస్పత్రితో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.