Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ మాజీ సీఎం అఖిలేశ్
లక్నో : బీజేపీకి చెందిన ఒక నాయకుడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ సింగ్ యాదవ్ ఆరోపించారు. సదరు నాయకుడి నుంచి తనకు బెదిరింపు ఫోన్కాల్, సంక్షిప్త సందేశం వచ్చిందని చెప్పారు. కన్నౌజ్లోని తన పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. ''ఒక బీజేపీ నాయకుడి నుంచి నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అతని నుంచి నాకు వచ్చిన మెసేజ్ను నేను నా ఫోన్లో నిక్షిప్తం చేసి ఉంచాను. దీనిపై త్వరలో లక్నోలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను'' అని అఖిలేశ్ తెలిపారు.