Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాపై విమర్శలు చేసిన ప్రత్యర్థుల్ని క్షమిస్తున్నా
- నేనందరి ముఖ్యమంత్రిని.. ప్రధాని ఆశీస్సులు కోరుతున్నా..
- ప్రమాణ స్వీకారం సందర్భంగా కేజ్రీవాల్
న్యూఢిల్లీ : దేశ రాజధాని అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికలు అయిపోయాయి. ప్రచారంలో భాగంగా తమపై విమర్శలు చేసిన ప్రత్యర్థుల్ని క్షమిస్తున్నామని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఆశీస్సులు కోరుతున్నానన్నారు. ఆదివారం రామ్లీలా మైదానంలో ప్రజల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్.. కేజ్రీవాల్తోపాటు మరో ఆరుగురు మంత్రులతో ప్రమాణం చేయించారు. కేజ్రీవాల్ క్యాబినెట్లో చేరినవారిలో మనీశ్సిసోడియా, గోపాల్రారు, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేందర్జైన్,రాజేంద్రపాల్ గౌతమ్ ఉన్నారు. వీరంతా గత క్యాబినెట్లోని వారే. ఎన్నికల్లో విజయం తనది మాత్రమే కాదని, ఢిల్లీ ప్రజలందరిదీ అని కేజ్రీవాల్ అభివర్ణించారు. మీ కొడుకు మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో కొందరు ఆప్కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు కాంగ్రెస్కు ఓటేశారు. ఈరోజు నుంచి నేను అందరికీ ముఖ్యమంత్రిని. ఎవరి రాజకీయాలు వారికున్నా రెండు కోట్ల ఢిల్లీ ప్రజలు తన కుటుంబసభ్యులని కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోడీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినా, ఆయన బిజీగా ఉండటంతో రాలేకపోయారని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేజ్రీవాల్ ప్రతిదీ ఉచితంగా ఇస్తుంటారని కొందరు వ్యాఖ్యానించారు. కానీ, ప్రపంచంలోని ప్రతి విలువైన వస్తువును ప్రకృతి ఉచితంగానే ప్రసాదించిందని కేజ్రీవాల్ అన్నారు. తల్లి ప్రేమ, తండ్రి ఆశీస్సులు ఉచితమేనన్నారు. 'అందువల్ల కేజ్రీవాల్ ప్రజల్ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ కూడా ఉచితమేనని' కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నందుకు రుసుములు వసూలు చేయడం తనకు సిగ్గుచేటని కేజ్రీవాల్ అన్నారు.
వైరల్గా మారిన కేజ్రీవాల్ పౌర హక్కుల గీతం..!
ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ కార్యక్రమం ముగింపులో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను ఇప్పుడు ఓ పాట పాడతాను. అందుకు ఓ షరతు.. నాతోపాటు మీరూ పాడాలి. మనందరి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన చాలా అవసరం అంటూ కేజ్రీవాల్ పాట గురించి చెప్పారు. హమ్ హౌంగే కామ్ యాబ్(ఉరు షల్ ఓవర్కమ్) పాటను తాను పాడుతూ అందరితో పాడించారు. 1960లలో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం జరుగుతున్నపుడు ఉరు షల్ ఓవర్కమ్ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాటను హిందీలోకి కవి గిరిజాకుమార్ మాథుర్ అనువదించారు.
కేజ్రీవాల్ వేష ధారణతో ఆకట్టుకున్న బుడతడు
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరి దృష్టీ ఓ బుడతడిపైకి మళ్లింది. ఎర్రటి స్వెట్టర్, కళ్లద్దాలు, తలకు ఆమ్ఆద్మీ పార్టీ అంటూ వ్రాసి ఉన్న తెల్లటి టోపీ, మెడ చుట్టూ మఫ్లర్తో అచ్చం కేజ్రీవాల్ వేషధారణతో ఉండే ఏడాది వయసున్న ఈ పసివాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు. ఈ బుడతడి ఫోటోల కోసం మీడియాతోపాటు పలువురు ఔత్సాహికులు ఎగబడ్డారు. ఆప్ ఎమ్మెల్యే భగవంత్మన్ ఈ బుడతడ్ని ఫోటోలు తీస్తూ సంబరపడ్డారు. మఫ్లర్ మ్యాన్గా పేరున్న ఈ బుడతడి పేరు అవ్యాన్ తోమర్. ఎన్నికల ఫలితాల రోజు సోషల్ మీడియాలో ఈ బుడతడు సందడి చేయడంతో ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
మంత్రివర్గ విస్తరణలో అతిషీకి చోటు..?విద్యా సంస్కరణలకు మార్గదర్శి
ప్రస్తుతం కొత్తవారికెవరికీ అవకాశమివ్వని కేజ్రీవాల్..మంత్రివర్గ విస్తరణలో అతిషీ మార్లెనా, రాఘవ్చద్దాలకు చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన అతిషీ రాజకీయాల్లోకి రాకముందు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆప్ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. కమ్యూనిస్ట్ భావాలున్న ఆమె తల్లిదండ్రులు మార్క్స్, లెనిన్ల పేర్లను కలిపి మార్లెనాగా నామకరణం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాల్కాజీ నియోజకవర్గం నుంచి 11 వేలకుపైగా మెజారిటీతో ఆమె గెలుపొందారు.