Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్భయ దోషులకు మార్చి3 న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష
- నలుగురిని ఒకేసారి ఉరితీయాలని కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతంలో దోషులకు ఢిల్లీ కోర్టు మరోసారి డెత్వారెంట్ జారీచేసింది. వచ్చే నెల 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినరు శర్మ, పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, అక్షరు సింగ్లను ఒకేసారి ఉరితీయాలని ఢిల్లీలోని పాటియాల కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు సోమవారం కొత్త డెత్ వారెం ట్లను జారీచేసింది. ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు డెత్వారెంట్లు చేసినా.. దోషులు చట్టాలోని లొసుగులను అడ్డుపెట్టుకుని.. వరుసగా పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరిశిక్ష అమలు ఆలస్యమైంది. తాజాగా జారీ చేసిన ఈ వారెంట్ మూడోది కావడం గమనార్హం. ఈ కేసులో ఉరిశిక్ష అమలు జాప్యం జరుగుతుందని వెంటనే దోషులకు డెత్ వారెంట్ జారీ చేయాలని కేంద్రం, నిర్భయ తల్లి దండ్రులు దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. దోషులు ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారికి ఉన్న అన్ని న్యాయపరమైన అవకా శాలనూ ఉపయోగించుకున్నారు. అలాగే వారికి కోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు కూడా పూర్తయ్యింది. వారు దాఖలు చేసిన అన్ని పిటిషన్లనూ కోర్టు విచారిం చింది. ప్రస్తుతం ఎలాంటి పిటిషన్లూ పెండింగ్లో లేవని తీహార్ జైలు అధికారులు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ..తాజాగా డెత్ వారెంట్ను జారీ చేసింది.
ఇదే చివరిది కావాలి : నిర్భయ తల్లి
ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మట్లాడుతూ..ఇప్పటికే ఉరిశిక్ష అమలు చాలా ఆలస్యమైందనీ, అయినా తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు సంతోషం కలిగించిందనీ, న్యాయం కోసం ఏడేండ్లుగా పోరాటం సాగిస్తున్నామన్నారు. దోషులకు ఇదే చివరి డెత్ వారెంట్ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు.