Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: గాంధేయవాది, సామాజిక సేవకులు, ప్రముఖ పారిశ్రామి కవేత్త, కేసీపీ లిమిటెడ్ చైర్మెన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ వెలగపూడి ల=ణ్దత్ (83) మంగళవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇందిరాదత్, కుమార్తె కవితా దత్ ఉన్నారు. 1937 డిసెంబర్ 27న జన్మించిన లక్ష్మణ్దత్ ఇంగ్లండ్లో విద్యనభ్యసించారు. డీఐఎం లండన్ నుండి పట్టా పొందారు. తన తండ్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగపూడి రామకృష్ణ స్థాపించిన కేసీపీ సంస్థల బాధ్యతలను చేపట్టారు. చిన్ననాటి నుంచి సామాజిక సేవాగు ణం కలిగిన లక్ష్మణ్దత్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారు. విద్యాలయాలు, వైద్యశాల లు, సామాజిక సేవా సంస్థలు నెలకొల్పారు. ఆయనకు 1989లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'యాజమాన్య రత్న' బిరుదు అందజేసింది. లక్ష్మణ్దత్ మృతికి సంతా పంగా గుంటూరులోని మాచర్ల కేసీపీ సిమెంట్స్ ప్లాంట్ వద్ద సిబ్బంది, కార్మికులు, ఉద్యోగులు, సీఐటీయూ నాయకులు నివాళులర్పించారు. కాగా, కేసీపీ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్గా ఇందిరా దత్, వైస్చైర్మన్గా కవితా దత్ వ్యవహరిస్తున్నాడు. లక్ష్మణ్దత్ అల్లుడు చిత్తూరి రవి కేసీపీ టెక్నాలజీస్ ఎమ్డీగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి, సీఎం, మాజీ సీఎం సంతాపంకేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణ్ దత్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. దత్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.