Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్వభారతిలో మార్చి 12 కార్యక్రమం రద్దుకు యత్నం?
- అధికారులపై మోడీ సర్కార్ ఒత్తిడి..?
- మౌఖిక ఆదేశాలతో రద్దయిందన్న అధికారులు
- ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకే!
మోడీ సర్కార్ మరోసారి తన ప్రభుత్వ విధానాలను విమర్శించేవారి గొంతు వినిపించకుండా అడ్డుపడింది. ప్రతిష్టాత్మక విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ హాజరు కావాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసేలా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ గుజరాత్లోని ఓ సాంస్కృతిక విద్యాలయ స్నాతకోత్సవంలో ప్రముఖ నర్తకి మల్లికా సారాభారు పాల్గొనాల్సి ఉండగా, ఆ కార్యక్రమాన్ని ఊహించనిరీతిలో రద్దు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
న్యూఢిల్లీ:బెంగాల్లోని విశ్వభారతి విశ్వ విద్యాలయం మార్చి 12న నిర్వహించాల్సిన కార్యక్ర మాన్ని నిరవధికంగా వాయిదా వేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఫాసిజంతో లింక్ ఉంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త, జేఎన్యూ మాజీ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ఆ కార్యక్రమంలో ప్రసంగించాల్సి ఉండగా, వాయిదా పడింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న పట్నాయక్కు యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్ని మెయిల్ ద్వారా తెలియజేసినట్టు ది టెలిగ్రాఫ్ ఇంగ్లీష్ దినప త్రిక వెల్లడించింది. వాస్తవానికి ఈ కార్యక్రమం ఆ విశ్వవిద్యాలయంలో ఏటా నిర్వహించాలని నిర్ణయిం చిందే. గతేడాది నుంచి విశ్వభారతిలోని రాజనీతి శాస్త్రం, ఆర్థికశాస్త్రం విభాగాలు సంయుక్తంగా 'అశోక్ రుద్ర మెమోరియల్ లెక్షర్' పేరుతో విద్యార్థుల కోసం ఓ కార్యమ్రాన్ని నిర్వహించాలని నిర్ణయించా యి. అందులో భాగంగానే ఆర్థికవేత్తయైన పట్నాయ క్ను ఈసారి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఎందుకు వాయిదా వేశారన్నదానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, తమ పేర్లు వెల్లడించొద్దని షరతు విధిస్తూ యూనివర్సిటీకి చెందిన కొందరు తమకు మౌఖిక ఆదేశాలున్నాయని తెలిపారు.
మౌఖిక ఆదేశాలు ఎవరి నుంచి..?
విశ్వభారతి కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం. దీనికి స్వయానా ప్రధాని మోడీ చాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. అదీగాక నిర్దేశిత కార్యక్రమం కేంద్రం కనుసన్నల్లో నడిచే యూజీసీ ఆధ్వర్యంలో జరిగేది. దాంతో, స్థానిక యూనివర్సిటీ అధికారుల్ని తప్పు పట్టలేమని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న ఉదార ఆర్థిక విధానా లు, తొందరపాటు నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మంద గమనం దిశగా పయనిస్తున్నదని విమర్శించినవారిలో ప్రభాత్ పట్నాయక్ కూడా ఒకరు. ఇదే ఆ కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడేందుకు కారణమై ఉంటుందని ఎవరికైనా అర్థమవుతోంది. నిరవధిక వాయిదా అంటే ఇక ఈ ఏడాది ఆ కార్యక్రమం జరిగే అవకాశంలేదని సంబంధితవర్గాలు తెలిపాయి. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారి గొంతు వినిపించకుండా చేయడం మోడీ సర్కార్కు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు ఉదంతాలు ఇలాంటివే జరిగాయి. ఈ నెల మొదటివారంలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)లో జరగాల్సిన స్నాతకోత్సవాన్ని ఊహించనిరీతిలో వాయిదా వేశారు. ఎందుకని ఆలోచిస్తే ఆ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథి ప్రముఖ డ్యాన్సర్ మల్లికాసారాభారు కావడమేనని పరిశీలకులకు అర్థమైంది. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆమె వ్యాఖ్యానించినందుకే ఆ కార్యక్రమం రద్దయిందని చెబుతున్నారు. ఎన్ఐడీ మేనేజ్మెంట్ కమిటీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలోని ఆరుగురు అధికారులు సభ్యులుగా ఉన్నారు. అంటే ఈ సంస్థ కూడా కేంద్రం కనుసన్నల్లో నడిచేదన్నది గమనార్హం. అయితే, ప్రతిష్టాత్మక ఎన్ఐడీ ఏర్పాటులో మల్లిక కుటుంబాని ది కీలక పాత్ర అన్నది మరువరాదు. ఫోర్డ్ ఫౌండేషన్ తో కలిసి 1961లో ఈ సంస్థను ఏర్పాటు చేయడంలో మల్లిక తల్లిదండ్రులు కీలక భూమిక నిర్వహించారు. మల్లిక తల్లి మృణాళిని కూడా డ్యాన్సర్. మల్లిక తండ్రి ప్రముఖ రోదసీ శాస్త్రవేత్త విక్రమ్సారాభారు. భారత రత్న ఏపిజె అబ్దుల్క లామ్లాంటి వారికి స్ఫూర్తినిచ్చిన శాస్త్రవేత్త. విక్రమ్ సారాభారుని భారత రోదసీశాస్త్ర పితగా అభివర్ణిస్తారు. జరిగిన మరో ఘటనలోనూ మోడీ సర్కార్ తీరు పట్ల విమర్శలొస్తున్నాయి. బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహామ్స్ను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించిన తీరు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్పై ఏర్పాటైన బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుల కమిటీకి డెబ్బీ చైర్పర్సన్ కూడా. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణం రద్దు తర్వాత ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ డెబ్బీ విమర్శలు చేశారు. దాంతో, తనకు వీసా గడువు ముగియకున్నా తనకు ఇక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరించారని డెబ్బీ ఆరోపిస్తున్నారు. తనకు బిజినెస్ వీసా 2019 అక్టోబర్లో జారీ చేశారని, ఈ ఏడాది అక్టోబర్ వరకూ గడువు ఉన్నదని ఆమె తెలిపారు. ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులకు సంబంధిత పత్రాలు చూపిస్తున్నా వినిపించుకోలేదని ఆమె గుర్తు చేశారు. తనను ఓ నేరస్తురాలిగా చూశారని భారత అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ అంశం అంతర్జాతీయమైందన్నది గమనార్హం.
కాగా దేవికారాణి తన బినామీల ద్వారా దాదాపు ఏడు కోట్ల రూపాయల మేర విలువైన నగలను ఖరీదు చేసినట్టు ఏసీబీకి సమాచారం లభించింది. ఇందులో కొంత మేరకు నగలను ఏసీబీ స్వాధీనం కూడా చేసుకుంది. కానీ, దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువైన నగల గురించి ఆచూకి లభించడం లేదని తెలిసింది. ఈ విషయమై నిందితురాలు దేవికారాణిని కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించినప్పటికీ.. ఆమె నుంచి వాటికి సంబంధించిన సమాచారం బయటపడలేదని తెలిసింది. కాగా, తమదైన శైలిలో విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు ఈ రెండున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు నగల గురించి ఆధారాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.