Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్నయ్యకుమార్ను విచారించేందుకు అనుమతులపై ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : జేఎన్యూఎస్యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, ఇతరులను విచారించేందుకు అనుమతులకు సంబంధించిన అంశంపై ఏప్రిల్ 3 నాటికి యథాతథ స్థితి నివేదికను సమర్పించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే వారిని విచారించేందుకు అవసరమైన అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రిమైండర్ పంపాల్సిందిగా ఢిల్లీ పోలీసులను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) ఆదేశించారు. కన్నయ్య కుమార్, ఇతరులను విచారించేందుకు ఇంకా అనుమతి మంజూరు చేయలేదని, అనుమతి మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని కేసు విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. 2016 ఫిబ్రవరిలో జేఎన్యూ క్యాంపస్లో దేశ వ్యతిరేక నినా దాలు చేశారని ఆరోపిస్తూ కన్నయ్యకుమార్, ఉమర్ ఖలీద్; అనిర్బన భట్టా చార్య తదితరులపై దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.