Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత మార్పిడి కేసులో..
భోపాల్ : మూడేండ్ల క్రితం 60 మంది చిన్న పిల్లలను మత మార్పిడి చేయడానికి ఎత్తుకుపోయారనే కేసులో అరెస్టైన ఎనిమిది మంది క్రిస్టియన్లను మధ్యప్రదేశ్లోని రత్లాం కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వివరాల్లోకెళ్తే... 2017 మే 22న మధ్యప్రదేశ్లోని 60 మంది గిరిజన, దళిత చిన్నారులను అపహరించారనే ఆరోపణతో రత్లాంలోని రైల్వే పోలీసులు 8 మంది క్రిస్టియన్లను అరెస్టు చేశారు. వీరు పిల్లలను మత మార్పిడి కోసం మహారాష్ట్రలోని నాగ్పూర్కు తీసుకెళ్తున్నారని పోలీసులు ఆరోపించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు (అరెస్టు చేసే సమయానికి) కావడంతో వారిని జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మహిళలనూ అరెస్టు చేసి పదిరోజుల్లో విడుదల చేయగా.. మిగిలిన వారికి రెండు నెలల తర్వాత బెయిల్ దక్కింది. కాగా, మూడేండ్ల తర్వాత వీరిపై మోపిన అభియోగాలు చెల్లవని కోర్టు తీర్పు చెప్పింది.