Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనల హోరు
తిరువనంతపురం : మోడీ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై(2020-21) కేరళలో నిరసనలు హోరెత్తుతున్నాయి. వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) నేతృత్వంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనలు, ధర్నాలలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజావ్యతిరేకంగా ఉందని నినదిస్తూ 140 అసెంబ్లీ నియోజికవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనబాటపట్టారు. ఎల్డీఎఫ్ కార్యకర్తలు రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. రైల్వేకు, ఎయిమ్స్కు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, కేరళలోని ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా విస్మరించారని, కేరళపై బీజేపీ రాజకీయ ప్రతికార ధోరణితో ఉందన్నది బడ్జెట్లో వ్యక్తమైందని ఈ సందర్భంగా ఎల్డీఎఫ్ నాయకులు ఆరోపించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎ.విజయరాఘవన్, కె.రాధాకృష్ణన్ సహా పలువురు సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ధర్మాల్లో పాల్గొని ప్రసంగించారు.