Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ఒడిషాలోని బాలంఘీర్లో మోతిలాల్ ఓస్వాల్-కిస్ రెసిడెన్సియల్ స్కూల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 15న జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. స్కూల్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బాలంఘీర్ వంటి వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజన పిల్లల అభివృద్ధిలో ఈ పాఠశాల కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ పాఠశాల జిల్లాలోని గిరిజనుల విద్యలో కొత్త శకానికి నాంది పలుకుతుందని గౌరవ అథితిగా విచ్చేసిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తుకుని సాహూ అన్నారు. మానవాళికి విద్య కంటే గొప్ప బహుమతి మరొకటి లేదని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంటు సభ్యులు సంగితా కుమారి సింగ్ డియో, ఎమ్మెల్యే నర్సింగ్ మిశ్రా, బాలంఘీర్ కలెక్టర్ అరబింద డాకువా, కిస్, కేఐఐటీ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుతా సమంతా, మోతిలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ చైర్పర్సన్ సునీతా అగర్వాల్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ చైర్మెన్ రమాడియో అగర్వాల్, బిమల ఓస్వాల్లతో పాటు 20 వేల మంది స్థానికులు పాల్గొన్నారు.