Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి లేఖ రాసిన నావికాదళం మాజీ అధికారి
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన లాక్డౌన్తో ఇబ్బందులెదుర్కొంటున్న వారికి సహాయం అందించడానికి కేంద్రం తమ సేవలను వినియోగించుకోవాలని నావికాదళం మాజీ అధికారి ఎల్. రాందాస్ ప్రధానిని కోరారు. ఈ మేరకు మోడీకి ఆయన లేఖ రాస్తూ.. 'ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టమైనవనీ, వీటికి సాధారణ చర్యలు తీసుకుంటే సరిపోవు. లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు, దినసరి కూలీలు, నిరాశ్రయులకు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆహార అవసరాలను ఆర్మీ తీర్చుతుందనే భరోసా నాకుంది. ఆర్మీ, నౌక, వాయుసేనల్లో నిష్ణాతులైన సైనికులున్నారు. వీరు ప్రత్యేకమైన భోజనశాలల ద్వారా ఆహారం వండి ఆకలితో బాధపడుతున్నవారి వద్దకే నేరుగా చేర్చగలరు. మూడు విభాగాలను సమన్వయం చేసుకుంటూ వారి సేవల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి' అని లేఖలో పేర్కొన్నారు.