Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులు భారత విదేశీ మారకనిల్వల్ని కరిగించేస్తున్నాయి. మార్చి 20నాటికి సుమారుగా 11.98 బిలియన్ డాలర్ల నిల్వలు (రూ.90వేల కోట్లు) తగ్గాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం, విదేశీ మారక నిల్వలు ఈస్థాయిలో పడిపోవటం గత ఆరునెలల్లో అత్యధికం. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద ఎత్తున అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఈ కారణంగా దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపుదార్లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. దాంతో డాలర్తో రూపాయి మారకం విలువ (రూ.76.15) కూడా రికార్డుస్థాయిలో పడిపోయింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ పెద్ద మొత్తంలో డాలర్లను మార్కెట్లకు సరఫరా చేయాల్సి వస్తున్నది. ఈ పరిణామం మనదేశ విదేశీ మారక నిల్వలు తగ్గడానికి దారితీస్తున్నది. ఆర్బీఐ విడుదలచేసిన తాజా సమా చారం ప్రకారం, మార్చి 20 నాటికి మార్కెట్ల నుంచి డాలర్కు డిమాండ్ పెరగటంతో ఆ వారంలో 11.98 బిలయన్ డాలర్లను (రూ.90వేల కోట్లు) ఆర్బీఐ సరఫరాచేసింది. దాంతో మనదేశంలో విదేశీ మారక నిల్వలు 469.9 బిలియన్ డాలర్లకు (రూ.35.19లక్షల కోట్లు) పడిపోయాయి. ఇంతకంటే ముందు వారంలో కూడా ఫారెన్ ఎక్ఛేంజ్లకు 5.34 బిలియన్ డాలర్లను(రూ.40వేలకోట్లు) సరఫరా చేయాల్సిరావ టంతో విదేశీ మారక నిల్వలు 481 బిలియన్ డాలర్లకు (రూ.36లక్షల కోట్లు) చేరుకున్నాయి. వారం రోజుల వ్యవధిలో 1.6 బిలియన్ డాలర్ల (రూ.11వేల కోట్లు) విలువజేసే బంగారు నిల్వలు సైతం అడుగంటిపోయాయి. ప్రస్తుతానికి ఐఎంఎఫ్ వద్ద మనదేశానికి ఉన్న విదేశీ మారక నిల్వలు 3.54 బిలియన్ డాలర్లకు (రూ.26వేలకోట్లు) చేరుకున్నాయి. కరోనా భయాలు, లాక్డౌన్ కారణంగా, ఇందులో 77మిలియన్ డాలర్లు (రూ.576కోట్లు)తగ్గుదల నమోదైంది.