Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఢిల్లీ సీఎం కేజ్రివాల్
ఢిల్లీలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలసల కార్మికులు ఇక్కడే ఉండిపోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు. అవసరమైన వారికి వసతి, భోజన సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారి గ్రామానికి అనుమతించేది లేదని కేజ్రీవాల్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
వలస కార్మికులను ఆదుకుంటాం :
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే
ముంబయి : వలస కార్మికులకు తమ ప్రభుత్వం ఆదుకుంటుందనీ, వారికి అవసరమైన భోజనం, తాగునీరు ఏర్పాట్లను కల్పిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు వారు ప్రస్తుతమున్న ప్రదేశాలను వదిలి ఎక్కడకూ వెళ్ళకూడదన్నారు. వారి ఆందోళనను తాను అర్థం చేసుకున్నప్పటికీ, వైరస్ వ్యాప్తి వలన ప్రమాదం పెరగకుండా నివారించాలన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.10కే భోజనం పథకం ఏప్రిల్ 1 నుంచి రూ.5లకే భోజనాన్ని అందించనున్నట్టు థాక్రే తెలిపారు. వలస కార్మికులకు భోజనాన్ని అందించేందుకు రాష్ట్రంలో ఇప్పటికే 163 కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు.