Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల దేశవ్యాప్త మూసివేతను పొడగిస్తారని వస్తున్న వార్తలు నిరాధారం అని కేంద్రం స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే అని తేల్చి చెప్పింది. దేశంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించనుందని పలు వార్తా ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. అంతేగాక గడిచిన మూడు రోజులుగా ఢిల్లీ, లక్నోలలో వలసకూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు గానూ కేంద్రం అనుసరించిన చర్యతో వేలాది మంది దినసరి కూలీలు గుమిగూడటం, వారందరినీ కిక్కిరిసిన బస్సుల్లో తరలించడంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్న తరుణంలోనూ మూసివేతను కొనసాగిస్తారని మరొక వాదన వినిపించింది. దీంతో కేంద్రం పై విదంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబ స్పందిస్తూ... అవన్నీ నిరాధార వార్తలే అని స్పష్టం చేశారు. తాను ఈ వార్తలు చూసి ఆశ్చర్యానికి గురయ్యాననీ, లాక్డౌన్ను పొడిగించే ఉద్దేశమేమీ కేంద్రానికి లేదని అన్నారు. ఈ వార్తలను ప్రసార భారతి కూడా ఖండించింది. అది 'నకిలీ వార్త' అని తెలిపింది.