Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాష్ట్ర వ్యాప్తంగా మార్నింగ్ వాక్లపై నిషేధం విధించినట్టు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. నివాసాల నుంచి బయటకు వచ్చే వారిపై చర్యలు తీసుకునేందుకు పార్క్లలో సిబ్బందిని నియమించనున్నట్టు జాయింట్ కమిషనర్ షాలిని సింగ్ తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఆరునెలల జైలుశిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తామనీ, లేదా రెండు శిక్షలూ విధించవచ్చని ఆమె వెల్లడించారు. ఈ నెల 29 నుంచి 153 మందిపై ఈ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.