Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ మంత్రి సంజరు జా
పాట్నా : ఢిల్లీ, యూపీ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్లు తీసుకున్న చర్యల కారణంగా తమ రాష్ట్రంలో లాక్డౌన్ వైఫల్యం చెందిందని బీహార్ నీటిపారుదల శాఖ మంత్రి సంజరు జా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లోకి అనుమతించిన వలస కూలీలను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. బీహార్ విపత్తు నిర్వహణ బృందంలో సభ్యులైన జా మాట్లాడుతూ తమ రాష్ట్ర సరిహద్దులోని ప్రత్యేక శిబిరాల్లో వలస కూలీలను ఉంచాలని నిర్ణయించామనీ, అందుకు నిరాకరిస్తూ కొందరు హింసాకాండకు పాల్పడుతున్నారనీ, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.