Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది స్కూల్ ఫీజులు కట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని కర్నాటక ప్రాథమిక, మాధ్యమిక శాఖ మంత్రి ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అలాంటి పాఠశాలలను మూసివేస్తామనీ, అంటువ్యాధుల నివారణ చట్టం 1897 కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎలాంటి అడ్మిషన్ ప్రక్రియ, ఫీజు వసూళ్లు చేయవద్దని పాఠశాల యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఈ షరతులు వచ్చే నెల 14 వరకు వర్తిస్తాయనీ, అనంతరం ప్రభుత్వం పరిస్థితిపై పునర్ సమీక్షించనున్నదని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఏప్రిల్ 14 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది.