Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గిరిజనులకు చేరవేసిన కలెక్టర్, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే
తిరువనంతపురం : ఓ పక్క కరోనా మరోపక్క లాక్డౌన్... నగరాలు, పట్టణాలతోపాటు పల్లె ప్రజలూ నానా కష్టాలు పడుతున్నారు. అందులో కేరళను ఒకదాని తర్వాత మరొకటి ప్రకృతివిపత్తు తరుముకొస్తూనే ఉన్నది. వరదలు.. నిఫా వైరస్తో మొన్నటి వరకూ అల్లాడిన కేరళ.. ఇప్పుడు కరోనాతో యుద్ధం చేస్తున్నది. పినరయి విజయన్ సర్కార్ కరోనా
కేరళలో నిత్యావసరాలను మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అనేక చర్యలు చేపడుతు న్నది. పట్టణాలనుంచి పల్లెలు, మారుమూల గిరిజన ప్రాంతాలల్లో నివసించే ప్రజల వరకూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. కొండలు, గుట్ట లు ఎక్కి మరీ, వారి అవసరాలను తీరుస్తున్నది. లాక్డౌన్ సమయంలో చిత్త శుద్ధితో పనిచేస్తున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు గిరిజన ప్రాంతాల వారికి అవస రమైన నిత్యావసరాలు, సరుకులను భుజాలపై మోసుకొని అందచేస్తున్నారు. కేరళలోని పథనమ్ తిట్ట జిల్లా కలెక్టర్ పిబి నూV్ా,స్థానిక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కెయు జెనిష్ కుమార్ ఇలా చేసే గిరిజనుల ఆకలి దప్పులను తీరుస్తు న్నారు. వారిద్దరూతమభుజాలపై నిత్యావసరాలను మోస్తూ, గుట్టలు, వాగులు, వంకలు దాటి మరీ వారిఅవసరాలను తీర్చారు. పథనమ్ తిట్ట పట్టణం నుంచి దాదాపు గంటన్నర నడిచారు.