Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జాతీయ రహదార్లపై పేదలు, వలసకూలీలు
-ఆకలితో అలమటిస్తూ... వందల కి.మీ ప్రయాణం
- ఢిల్లీ, యూపీ, బీహార్లలో రోడ్లమీద అవస్థలు
- సరైన ఏర్పాట్లు చేయలేకపోయిన ప్రభుత్వాలు
చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ముంబయి, సూరత్, అహ్మదాబాద్లలో...వలస కార్మికులు, దినసరి కూలీలు లక్షల సంఖ్యలో పనిచేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వీరంతా ఖాళీ కడుపులతో రోజులు వెళ్లదీస్తున్నారు. స్వస్థలాలకు బయల్దేరిన వలసకార్మికులు రోడ్లమీదకొచ్చి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వాప్తి, లాక్డౌన్ కారణంగా... పేదలు, వలస కూలీలు దిక్కులేని పరిస్థితిలో చిక్కుకున్నారు. నగరాల్లో ఉపాధి లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. కనీసం స్వంత ఊరికైనా వెళదామని బయల్దేరితే అనేక అడ్డంకులు. జిల్లా, రాష్ట్ర సరిహద్దులు మూసేసి పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులన్నీ కూలీలతో నిండిపో యాయి. ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గడ్, ముంబయి.. ఇలా ఆయా రాష్ట్రాల్లోని తమ ఊర్లకు చేరుకునేందుకు వేలాది కి.మీ కాలి నడకనే ప్రయాణిస్తున్నారు. చేతుల్లో బకెట్లు, బట్టల బ్యాగులు, ఇతరత్రా వంట పాత్రలు పట్టుకుని వారు కాలినడకను కొనసాగిస్తున్నారు. వారిలో అత్యధికులు రోజుకు రూ.150 నుంచి రూ.300 వరకు సంపా దించుకునేవారే. అదేవిధంగా పలు రాష్ట్రాల్లోని రాజధానుల నుంచి పేదలు బిక్కుబిక్కుమంటూ తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వాలు ఏమేరకు వారిని ఆదుకుంటున్నాయో ఇప్పటివరకైతే స్పష్టమైన సమాచారం లేదు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం కోసం దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్డౌన్ అమలుజేస్తున్నామని ప్రధాని మోడీ గత మంగళవారం ప్రకటించారు. ఒక్కసారిగా దేశమంతా ఎక్కడిపనులు అక్కడ ఆగిపోయాయి. దాంతో ఎవ్వరికీ పని లేకుండా పోయింది. ఎవ్వరూ కనిపించకూడదంటూ, ఇంటికే పరిమితం కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిర్మాణరంగంలో పనిచేసే కూలీలు, చేతివృత్తులు చేసుకునేవారు, ఆహార ఉత్పత్తిలో పనిచేస్తున్న కార్మికులు, ట్రక్ డ్రైవర్లు, ఇంటి పనివాళ్లు ఇలాంటి వారి జీవితాలు ఒక్కరోజులో తలకిందుల య్యాయి. పాలకు, కూరగాయలకు, బియ్యం, పప్పు, ఉప్పు, నూనె.. ఇంటి అద్దె...వీటికి డబ్బులెలా వస్తాయన్నఆలోచన వారిని తొలిచేస్తున్నది.
వారాలు, నెలల తరబడి చేతిలో పనిలేకపోతే రోజువారి అవసరాలు ఎలా తీరుతాయన్న ఆందోళన వారిలో మొదలైంది. దాంతో భార్యా పిల్లలతో కలిసి పేదలు, వలస కూలీలు రోడ్లమీదకొస్తున్నారు. బస్సు, రైలు లేకపోయినా...స్వంత ఊరుకు చేరుకుంటే చాలు ! అన్న ఆశతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ''ఇక్కడే ఉంటే ఆకలితో చచ్చిపోయేలా గున్నాం. రెండు రోజులుగా ఏదీ తినలేదు. భయంకర వ్యాధి కరోనా వస్తుందని ఆందోళన చెందుతున్నాం. మా వూరు వెళ్లిపోతా''మని యూపీలో రేఖాదేవి అనే మహిళ చెప్పింది.
ప్రభుత్వాలు ముందస్తు ఏర్పాట్లు చేయాల్సింది: రాజకీయ విశ్లేషకులు
పేదలు, వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఇలా రోడ్ల మీదకు రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తపడాల్సిం దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భయ పడవద్దు నగరాల్లోనే ఉండండి..అని వారికి భరోసా కల్పించా ల్సింది. వారికి కావాల్సిన నిత్యావసర సరు కులు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి. గూమికూడిన వారిలో ఒకరికి ఈ వైరస్ ఉంటే, తర్వాత పరిణా మాలెలా ఉంటాయో ఊహించుకోండి! దేశమంతా 21రోజుల పాటు లాక్డౌన్ పాటించిన ఫలితం దక్కుతుందా?
ఇలా చేసి ఉండాల్సింది కాదు
ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించ గానే, వేలాదిమంది ఒక్కసారిగా సూపర్మార్కెట్లపై పడ్డారు. రెండు మూడు నెలలకు కావల్సిన వస్తువులన్నీ ఒకేసారి కొనేయాలని తాపత్రయప డ్డారు. నగరంలో కనిపించిన ఈ భయానక వాతా వరణం అక్కడున్న పేదలు, వలస కూలీల్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేసిందని విశ్లేషకులు చెబుతు న్నారు. మరోవైపు బస్సులు, రైలు అంతా బంద్ అనే సంగతి తెలిసిపోయింది. దాంతో వలస కూలీలు, పేదలు సైతం తమను తాము రక్షించుకోవడం కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్లమీద కొస్తున్నారు.