Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విక్రయించలేక పారబోసిన రైతు
బెంగళూరు : లాక్డౌన్ కారణంగా పాలు విక్రయించే అవకాశం లేక ఒక వ్యక్తి 1500 లీటర్ల పాలను కాలువలో పారబోశారు. కర్నాటకలోని బెల్గావి జిల్లాలోని పల్బావి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘట పభా ఎడమకాలువలో 50 క్యాన్ల పాలను కాలువలోకి పారబోస్తున్న వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. లాక్డౌన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆ వ్యక్తి తెలిపారు. గ్రామంలోని పాడి రైతుల నుంచి రూ.30లకు సేకరిస్తున్నామని, కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)సంస్థ రూ. 10 మాత్రమే చెల్లిస్తోందని చెప్పారు. ప్రస్తుతం గ్రామంలోని కెఎంఎఫ్ యూనిట్ పాల సేకరణ నిలిపివేసిందని, దీంతో విక్రయించడానికి బదులుగా పారేయడం మంచిదని నిర్ణయించుకున్నారని స్థానిక గౌలి సంఘం సభ్యులు తెలిపారు.