Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ గ్రహించలేదు :కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కరోనాను నియంత్రించడానికి విధించిన రెండు నెలల లాక్డౌన్ వల్ల దేశం మొత్తం నష్టపోయిందని, అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ ఇంకా దీనిని గ్రహించలేదని కాంగ్రెస్పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఇంటికి తిరిగి వెళ్ళిన వలస కార్మికులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధిని కోల్పోయిన ప్రజలు ఎక్కువగా నష్టపోయారని ఆమె అన్నారు. దేశం వలస కార్మికుల బాధను చూసిందని, కానీ బీజేపీ మాత్రం చూడలేదన్నారు. గురువారం సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 'స్పీక్అప్' ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ '' ప్రతి పేద కుటుంబానికి వచ్చే ఆరు నెలల పాటు రూ. 7,500 ఇవ్వాలి'' అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.