Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ : మోడీ సర్కార్పై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రాలతో ఎటువంటి ముందస్తు ప్రణాళికలు, చర్యలు చేపట్టకుండా హోం మంత్రిత్వ శాఖ రైళ్లు నడపడానికి అనుమతినివ్వడానికి ముందు...రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సంప్రదించి ఉండాల్సిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్లే రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య అమాంతం పెరిగాయని తెలిపారు. కోవిడ్-19పై పోరుకు ఇప్పుడిప్పుడే సిద్ధమౌతుండగా..అంతలో వలస కూలీలను తిరిగి స్వస్థలాలకు తరలించడంతో బాధితుల సంఖ్య పెరిగి..సవాళ్లు మరింత కఠినతరం అవుతున్నాయని అన్నారు. జార్ఖండ్లో ప్రస్తుతం 450 మంది కరోనా బారిన పడ్డారని, ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందారని తెలిపారు.