Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-3న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించేందుకు జూన్ 3న హో మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. రెండు నెలల క్రితం కోవిడ్-19 లాక్డౌన్ విధించిన తరువాత మొదటిసారి హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చే బుధవారం (జూన్ 3) సమావేశం కానుంది. దేశంలో 1.51 లక్షలకు పైగా కరోనా సోకిన కేసులు నమోదు కావడం, ఈ వ్యాధి వల్ల 4,337 మంది ప్రాణాలు కోల్పోవడం, లాక్డౌన్ చర్యపై ప్రభుత్వం స్పందించడంపై కమిటీ చర్చించనుంది. లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితిపై కేంద్ర హోం కార్యదర్శి అజరు భల్లా జూన్ 3న కేంద్ర వాణిజ్య మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ఆనంద్ శర్మ నేతృత్వంలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి వివరించనున్నారు. మార్చి 24న దేశంలో లాక్డౌన్ విధించిన తరువాత జరిగి మొదటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఇదే. అయితే ప్యానెల్లో సభ్యుడైన సీనియర్ ఎంపీకి మాట్లాడుతూ సమావేశానికి సంబంధించి నాకు ఇంకా అధికారిక నోట్ రాలేదన్నారు. లాజిస్టిక్స్పై ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఉన్నాయనీ, ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తే నిర్బంధం చేయాల్సి వస్తుందా? అనేదానిపై స్పష్టత అవసరమని ఎంపీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్యానెల్ చైర్మన్లైన ఆనంద్ శర్మ (హోం), భర్తృహరి మెహతాబ్ (కార్మిక), శశి థరూర్ (ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ)లు డిమాండ్ చేశారు. అయితే ఎలక్ట్రానిక్ ద్వారా నిర్వహించడానికి ఎటువంటి నియమాలు లేనందున పార్లమెంట్ అందుకు ముందు రాలేదు. ఈనెల ప్రారంభంలో రాజ్యసభ చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇద్దరూ రాజ్యసభ, లోక్సభల సెక్రెటరీ జనరల్స్ సమావేశాల నిర్వహణ అవకాశాలను, సురక్షిత సాంకేతిక వేదికలను ప్రారంభించడానికి అవసరమైన సమయంపై నివేదికను సమర్పించాలని కోరారు. మరోవైపు 22 ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆయా పార్టీల నేతలు పార్లమెంటరీ పనితీరును పునరుద్ధరించాలని, స్టాండింగ్ కమిటీల తక్షణమే అమలు చేయమని డిమాండ్ చేశారు.
కోవిడ్-19 లాక్డౌన్ 4.0లో విమాన, రైలు ప్రయాణాలు పున:ప్రారంభమవ్వడంతో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించడానికి పార్లమెంట్ సన్నద్ధమవుతోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మెన్ ఎం. వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. పార్లమెంట్ హౌస్లో తొమ్మిది గదులు, 24 డిపార్ట్మెంట్ సంబంధిత స్టాండింగ్ కమిటీల రెగ్యులర్ సమావేశాలు, ఉభయ సభల ఇతర కమిటీలకు మరో ఆరు గదులు ఉన్నట్టు గుర్తించారు. పార్లమెంట్ ఎనెక్స్ భవన్లో ఉన్న మెయిన్ కమిటీ రూమ్ మాత్రమే భౌతిక దూర ప్రమాణాలకు కట్టుబడి ఉంది. మిగతా రూమ్ల్లో కూడా భౌతిక దూరాన్ని నిర్వహించడానికి అదనపు సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఓం బిర్లా, వెంకయ్యనాయుడు ఆదేశించారు.