Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా బెంబేలెత్తిస్తోంటే.. మరోవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఉత్తరభారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు దడ పుట్టిస్తున్నాయి. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 26న ఢిల్లీలోనూ సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. గరిష్టంగా 48 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు స్థిరపడ్డాయి. దేశ రాజధాని గడచిన 18 ఏండ్లలో ఇంత ఉష్ణోగ్రతలను ఎన్నడూ చూడలేదు. మే 21న మొదలైన ఉత్తర-పశ్చిమ గాలుల కారణంగానే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీంతో ఊహించనంతటి వేడి గాలులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల 21వ శతాబ్దంలో ఈ తీవ్రత మరింత పెరగనుంది. వరుసగా ఐదు రోజుల పాటు సాధారణం కంటే ఐదు డిగ్రీలు లేదా అంతకంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. భారీ ఉష్ణోగ్రతలపై పలు దేశాలు.. భారత్లా స్వంత ప్రమాణికాలను ఆవలంభిస్తున్నాయి.
కొద్ది రోజులుగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఫలితంగా డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఫలితంగా మరణాలు కూడా సంభవించే పరిస్థితి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని త్వరగా గుర్తించలేమని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం వడగాల్పుల కారణంగా 1998-2017 మధ్య 1,66,000 మంది, 2015లో భారత్లో 2,500 మంది మరణించారు.