Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో పరీక్షలు.. తిరిగి జైలుకు తరలింపు
ముంబయి : ఎల్గర్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవరరావు అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజుల నుంచి ఆయనకు తల తిప్పుతుందని చెప్పినా పట్టించుకోని జైలు అధికారులు.. సోమవారం అస్వస్థతకు గురవడంతో సమీపంలో ఉన్న జెజె ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయమై ఓ అధికారి మాట్లాడుతూ.. వరవరరావు నిత్యం వేసుకునే మాత్రలు వేసుకోకపోవడం వల్లే ఆయనకు తల తిప్పినట్టుగా అయిందనీ, ఇప్పుడాయనకు బాగానే ఉండటంతో తిరిగి నవీ ముంబయిలో ఉన్న తలొజ జైలుకు తరలించామని చెప్పారు. ఆయనకు కోవిడ్ పరీక్షలు కూడా చేశామనీ, నెగిటివ్ రిపోర్డు రావడంతో తిరిగి జైలుకు తీసుకెళ్లినట్టు ఆ అధికారి తెలిపారు.