Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో కరోనా లాక్డౌన్ సమయంలో వలసకార్మికులను సొంత గ్రామాలకు పంపే ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలు పొందిన సినీనటుడు సోనూసూద్ మరో ఘనతను దక్కించుకున్నారు. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్బీ) నిర్వహించిన ఒక సర్వేలో ఆయన ఆగ్రస్థానంలో నిలిచారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సేవలు చేసిన సెలబ్రిటీల పనితీరుపై ఐఐహెచ్బీ ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో బాలీవుడ్ నటులు అక్షయకుమార్, అమితాబ్బచ్చన్లను వెనక్కి నెట్టి సోనూసూద్ అగ్రస్థానంలో నిలిచారు. అక్షయకుమార్ రెండవ స్థానంలో, అమితాబ్ బచ్చన్ మూడవ స్థానంలో నిలిచారు. ఈ సర్వే కోసం ఐఐహెచ్బీ 110 కార్పొరేట్ సంస్థలను, 550 మంది వినియోగదారులను ఇంటర్వ్యూ చేసింది. కార్పొరేట్ సంస్థలు 78.5 శాతం రేటింగ్ ఇవ్వగా, వినియోగదారుల 86.4 శాతం రేటింగ్తో సోనూసూద్ మొదటిస్థానంలో నిలిచారు. లాక్డౌన్ సమయంలో ప్రతి వలసకార్మికుడు తన గ్రామానికి చేరుకునేంత వరకు తాను సహాయం చేస్తూనే ఉంటానని ప్రకటించి దేశవ్యాప్తంగా పలువురి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.