Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపులో ముంబయి, థానే, కలబుర్గి
ముంబయి : భారీ వర్షాలు మహారాష్ట్ర రాజధాని ముంబయితోపాటు కర్నాటకలోని కల్బుర్గి తదితర ప్రాంతాలను వణికిస్తున్నాయి. గత 48 గంటల్లో ముంబైలో 298 మిల్లీమీటర్లు, ముంబై సబ్ అర్బన్ ప్రాంతాల్లో 357 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో దక్షిణముంబయిలో 129.6 మీమీ వర్షపాతం, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 200.8 మీమీ వర్షపాతం నమోదయింది. థానే జిల్లాతోపాటు కొంకణ్, విదర్భలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో థానేలోని ఒక భవనం కూలిపోయింది. కర్నాటకలోని కలబుర్గి జిల్లాలోని పలు ప్రా'ంతాల్లో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నాటక-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కొన్ని వంతెనలు కూలిపోయాయి. దీంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.