Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందేహాలను తీర్చుకునేందుకు ఆపసోపాలు
- పరిశోధన సంస్థల మధ్య కొరవడిన సహకారం, సమన్వయం
- కోవిడ్-19 వ్యాక్సిన్పై జరుగుతున్న ప్రయోగాలపై 'స్టాట్' నివేదిక
న్యూఢిల్లీ : కోవిడ్-19కు వ్యాక్సిన్గానీ, మందుగానీ కనుగొనటం కోసం జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ఓ దశాదిశ లేకుండా అస్తవ్యస్తంగా సాగుతున్నాయని అమెరి కాకు చెందిన మెడికల్ న్యూస్ వెబ్పోర్టల్ 'స్టాట్' తెలిపింది. స్వల్ప సందేహాలు తీర్చుకునేందుకు విలువైన వనరులు, సమయం ఖర్చు అవుతున్నాయనీ, వివిధ పరిశోధన సంస్థల మధ్య సమన్వయం లోపించటం వల్లే ఇదంతా తల ెత్తుతున్నదని 'స్టాట్' నివేదిక అభిప్రాయపడింది. ఉదా హరణకు, హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు ఫలితమివ్వదని తెలిసినా, దీనిపై పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగటమేంటని నివేదిక సందేహం వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 1200 క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా, అందులో ప్రతి ఆరింటిలో ఒకటి హైడ్రా క్సీక్లోరోక్వీన్ మందుపైనే ప్రయోగాలు జరుగుతున్నాయని నివేదికలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న తీరుపై నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదికలో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
వైరస్ తీరు అర్థం చేసుకోలేకపోతున్నారా!
ఇప్పటికే ఉన్న కొన్నిమందుల్ని ఎంచుకొని క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. ఇవన్నీ చాలాచిన్న చిన్న పరిశోధనలు. ఎలాంటి లక్షణాలూ లేకున్నా కొంతమందిలో వైరస్ ఉంటోంది. మరొకొంతమంది వెంటిలేటర్ వరకూ వెళ్లి మరణిస్తున్నారు. వైరస్ తీరును సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో విస్తృత స్థాయి , లోతైన పరిశోధనలు... ప్రయోగాలు అవసరం. 'రెమ్డెసివీర్' మందు కోవిడ్ రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తున్నదని విశ్వసనీయ సమాచారముంది. 'డెక్సామెథాసోన్' కోవిడ్ రోగుల్ని కాపాడటంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఇదొక్కటే ప్రస్తుతానికి ఉన్న ఆశాకిరణం. 13,600మంది కోవిడ్ రోగులపై ప్రయోగించగా, 12000మంది కోలుకున్నారు. ప్రెడినైసోన్, మిథైల్ప్రెడినైసోలోని...రెండు కూడా స్టెరాయిడ్స్. వీటిపై కూడా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి.
మానవ వనరులు, నిధులు వృథా అవుతున్నాయి : మార్టిన్ లాండ్రీ, ప్రొఫెసర్, ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మొదలైన క్లినికల్ ట్రయల్స్ దాదాపు 1200. ఇందులో అత్యధికం చాలా చిన్న చిన్న పరిశోధనలే. 100లోపు పేషంట్లను ఎన్రోల్ చేసుకొని ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. చాలా వరకు క్లినికల్ ట్రయల్స్ పూర్తి వివరాలు బయటకు రావటం లేదు. 38శాతం ట్రయల్స్లో అసలు పేషంట్లను ఎన్రోల్ చేసుకోవటమే లేదు. పరిశోధన సంస్థల మధ్య సహకారం, సమన్వయం లోపించింది. కొన్ని స్వల్పసందేహాలు తీర్చుకోవటం కోసం ఎంతో విలువైన మానవ వనరులను, పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేస్తున్నాయి.