Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది మే మాసానికి సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి)ని ప్రకటించడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో రెండు నెలలు ఆర్ధిక వ్యవస్థ లాక్డౌన్లో ఉండటంతో సరైనా సమాచార సేకరణ జరగలేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్చి చివరి వారం నుంచి చాలా వ్యాపారాలు తెరుచుకోలేదని కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకనటలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఐఐపితో పాటు ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం సూచీలను ప్రకటించకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. గత మే మాసంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 34.71 శాతం ప్రతికూల వృద్ధిని చవి చూసిందని రాయిటర్స్ అంచనా వేసింది. కాగా ఇంతక్రితం మాసాలతో మే 2020 ఐఐపిని పోల్చలేమని కేంద్రం పేర్కొంది.