Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత్ జీడీపీ మైనస్ 7.5 శాతం క్షీణించొచ్చు : బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరణలో ఆలస్యం జరిగే కొద్ది భారత ఆర్ధిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే ప్రమారం ఉందని విదేశీ బ్రోకరేజి సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విశ్లేషించింది. అన్నీ అనుకున్నట్టు సాగితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత జీడీపీ వద్ధిరేటు మైనస్ 4 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఒక వేళ వ్యాక్సిన్ ఆలస్యమైతే మాత్రం వద్ధిరేటు ఏకంగా మైనస్ 7.5శాతానికి క్షీణించే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగంలోని ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ మేరకు అంచనాలను సమీక్షించారు. ఆర్ధిక వ్యవస్థలో ప్రతికూలతలను ఎదుర్కోవడానికి ఆర్బీఐ మరొక్క శాతం వడ్డీ రేటు తగ్గించొచ్చని అంచనా వేశారు.