Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఢిల్లీ చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయి ధర..
- 11 పైసలు పెంపుతో ఆల్ టైం హైకి చేరిక
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మునుపెన్నడూ లేనంతగా డీజిల్ ధరలు అత్యంత గరిష్ట స్థాయికి చేరాయి. వరుసగా పెరుగుతున్న చమురు ధరల పెంపుతో అక్కడ నెల రోజులుగా పోటాపోటీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా లీటర్ డీజిల్ ఫై రూ.0.11 ల పెంపుతో ఢిల్లీ చరిత్రలో మొదటిసారి డీజిల్ ఆల్ టైం హై ధర (రూ.81.05) నమోదైంది. అయితే వరుస పెంపు కారణంగా డీజిల్ ధరలు.. పెట్రోల్ ను పదిహేను రోజుల క్రితమే దాటేసిన విషయం విది తమే. నెలరోజులపాటు దాదాపు రూ.10 దాకా పెరిగిన పెట్రోల్ ధరలు పది రోజుల నుంచి స్తబ్దుగా ఉండగా.. డీజిల్ ధరలు మాత్రం మోత పుట్టి స్తూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్రం, మరోవైపు కరోనా సెస్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ పేరిట రాజధాని ప్రజల జేబులను గుల్ల చేస్తున్నాయి. కరో నా విజృంభిస్తున్నా.. ఉపాధి, ఉద్యోగాలు కరువై ప్రజలంతా ఆకలికి అల్లాడు తున్నా ప్రభుత్వాలు మాత్రం జనాన్ని దోపిడీ చేస్తూనే ఉన్నాయి. చమురు ధరల పెంపుతో ఇతర వస్తువుల ధరలు పెరిగి సామాన్యజనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. మోడీ సర్కారు మాత్రమ్ ధరల పెంపుపై నోరు మెదపడం లేదు. ఇక సవరించిన ధరల ప్రకారం... ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 80.43 ఉండగా, డీజిల్ రూ. 81.05 గా నమోదైంది. ముంబయిలో పెట్రోల్ రూ. 87.19 లకు చేరగా, డీజిల్ రూ. 79.27 గా ఉంది. ఇవే ధరలు హైదరాబాద్లో రూ. 83.49, రూ. 79.14 గా నమోదయ్యాయి.