Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎలాంటి వైద్యపరీక్షలు లేకుండానే, దరఖాస్తుదారు సొంత అఫిడఫిట్తో ట్రాన్స్జెండర్ గుర్తింపు ధ్రువపత్రాన్ని జారీచేయనున్నారు. ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణ చట్టం 2020 ముసాయిదాను సోమవారం గెజిట్లో ప్రచురించారు. ఎలాంటి వైద్యపరీక్షలు లేకుండానే ఈ గుర్తింపును జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేస్తారని అందులో పేర్కొన్నారు. కొత్త ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలను, సూచనలను ఈ నెల 13 నుంచి 30 రోజల లోపు ఢిల్లీలోని శాస్త్రిభవన్లో ఉన్న తమ కార్యాల యానికి పంపాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం తెలిపారు. దరఖాస్తుదారు సమర్పించే అఫిడఫిట్తోనే 30 రోజుల్లోనే ఈ ధృవపత్రం జారీ చేయాలని కూడా ముసాయిదాలో పేర్కొన్నారు. ఆ జిల్లా పరిధిలో వరుసగా 12 నెలల పాటు నివాసం ఉంటున్నట్లుగానూ ప్రమాణపత్రం సమర్పించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా లింగమార్పిడి చేయించుకుని ఉంటే సంబంధిత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరణపత్రం జతచేయాలి. గతంలో నిబంధనల ప్రకారం గుర్తింపుకోసం అఫిడవిట్తో పాటు వైద్య నివేదిక కూడా అందించాల్సి ఉంది.