Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూర్ణో
తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళన చేయడం ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పనుల నిర్వహణలో జరుగుతున్న అలసత్వంపై ఎన్జీటీ ప్రిన్స్ పల్ బెంచ్ తీవ్రంగా మండిపడింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు, పర్యావరణ చట్టాల ప్రకారం హరిత ట్రిబ్యూనల్ నిర్వహించాల్సిన విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం, దాని అనుబంధ విభాగాలు విఫలమైన మెడల అది చర్యలకి దారి తీస్తుందని ఎన్జీటీ ధర్మాసనం హెచ్చరించింది. పారిశ్రామిక, గహ వ్యర్థాల పారబోత, నాలాల ఆక్రమణలతో మూసీ నది పెద్ద ఎత్తున కాలుష్యమవుతోందని... ఆక్రమణకి గురవుతోందని ఆ రెండింటి నుంచి నదిని రక్షించాలని మహ్మద్ నయీం పాషా తదితరులు 2018లో ఎన్జీటీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్జీటీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), రాష్ట్ర పురపాలక సంస్థ, పట్టణాభివద్ధి శాఖకి మంగళవారం నోటీసులు జారీ చేసింది.