Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పదంగా మారిన ఐఐఎంసీ డీజీగా సంజరు ద్వివేదీ నియామకం
-అనుభవం, అర్హతలపై తప్పుడు సమాచారమిచ్చాడని ఆరోపణలు
న్యూఢిల్లీ : జర్నలిజంలో అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందిన 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్' (ఐఐఎంసీ) డైరెక్టర్ జనరల్గా సంజరు ద్వివేదీ నియామకం వివాదాస్పదమైంది. తప్పుడు అర్హత పత్రాలు, అనుభవం చూపించి డైరెక్టర్ జనరల్ పదవికి సంజరు ద్వివేదీ ఎంపికయ్యారని ఆరోపణలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి అశుతోష్ మిశ్రా అనే వ్యక్తి ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. ఆర్ఎస్ఎస్ మద్దతుదారైన సంజరు ద్వివేదీపై న్యాయస్థానంలో పలు కేసులున్నాయని, తప్పుడు అర్హత, పని అనుభవం పత్రాలు సృష్టించారన్న ఆరోపణలు ఎదుర్కొం టున్నారని, ఈ కేసులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నా యని ప్రధానికి రాసిన లేఖలో అశుతోష్ మిశ్రా తెలిపారు. కేంద్ర సమా చార ప్రసార శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర సంస్థగా ఉన్న 'ఐఐఎంసీ'కి నూతన డైరెక్టర్ జనరల్గా సంజరు ద్వివేదీని జులై 1న కేంద్రం నియమించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆయన ఎంపికను ఖరారుచేసింది. మూడేండ్లపాటు ఆయన ఐఐఎంసీ డీజీగా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈనేపథ్యంలో మంగళవారం సంజరు ద్వివేదీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
'అర్హతలు లేని వ్యక్తిని ఎంపికచేశారు'
సరైన విద్యార్హతలు, పని అనుభవం లేని వ్యక్తిని ఐఐఎంసీ డీజీగా నియమించారని ప్రధాని మోడీకి రాసిన లేఖలో అశుతోశ్ మిశ్రా ఆరోపించారు. దీనికి సంబంధించి ద్వివేదీపై మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని, ద్వివేదీ పీహెచ్డీ పూర్తిచేయలేదని లేఖలో మిశ్రా పేర్కొ న్నారు. చతుర్వేది పత్రకారిత యూనివర్సిటీ (మధ్య ప్రదేశ్) వైస్ ఛాన్స్లర్గా ద్వివేదీని ఎంపికచేసినప్పుడే పలు ఆరో పణలు ఎదుర్కొన్నారని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఐఐఎంసీ డీజీగా ఎంపికచేయటమేంటని లేఖలో మిశ్రా ప్రశ్నించారు.