Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మాడభూషి సాహితీ పురస్కారం' ప్రదానోత్సవం
మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా, ఆచార్యులుగా రెండు దశాబ్దాల పాటు పని చేసి పదవీ విరమణ పొందిన ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పేరిట వారి విద్యార్థులు, శ్రేయోభి లాషులు నెలకొల్పిన 'మాడభూషి సాహిత్య కళాపరిషత్తు'' ప్రారంభోత్సవం సెప్టెంబరు 17 ఉదయం పది గంటలకు జూమ్ ఆప్ ద్వారా జరగనుంది. ఈ సందర్భంగా 'మాడభూషి సాహితీ పురస్కారం' ప్రదానో త్సవం కూడా నిర్వహించనున్నారు. మొదటి పురస్కారాన్ని ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, కవిసంధ్య పత్రికా సంపాదకులు ఆచార్య శిఖామణి గారికి, ప్రముఖ ముస్లింవాద కవయిత్రి డాక్టర్ షాజహానాకు ఇవ్వనున్నట్లు పురస్కార ఎంపిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా మాడభూషి సాహిత్యం పై వచ్చిన 'పాలపిట్ట' ప్రత్యేక సంచిక, మాడభూషిపై జరిగిన అంతర్జాతీయ పరిశోధన పత్రాలతో కూడిన 'భావవీణ' పత్రిక ఆవిష్కరణ కూడా నిర్వహించ నున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు మాడ భూషి సంపత్ కుమార్ పేర్కొన్నారు.
'రంగినేని సాహిత్య పురస్కారం' కథలకు ఆహ్వానం
రంగినేని సుజాతా మోహన్రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులఱు తన తల్లి కీ.శే. రంగినేని ఎల్లమ్మ పేరు మీద నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు తెలుగు కథా సంపుటాలను ఐదు కాపీలను అక్టోబర్ 2020 వరకు అందేలా అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం-2020, రంగినేని సుజాత మోహన్రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు, బాలాజీ నగర్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్లా జిల్లా - 505301 చిరునామాకు పంపించాలి. జనవరిలో ఈ పురస్కారం అందించనున్నట్టు అవార్డు కమిటీ అధ్యక్షులు, కన్వీనర్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. వివరాలకు 9441677373 లో సంప్రదించవచ్చు.