Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజు మరణించే నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగనమెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకులయందు
అని సర్వకాలాలందు ప్రజల నాలుకుల మీద నడయాడు అక్షరాలలో కవి చిరంజీవిగా ప్రకాశి స్తాడని చెప్పి తేజోమూర్తిగా కీర్తి గడించిన అపురూప కవి గుర్రం జాషువా ..ల
జాతి, కుల, మత, వర్గ భేదాలతో అట్టుడుకు తున్న సమాజంపై అక్షరమనే ఆయుధంతో ప్రళయగర్జన చేసిన నవ యుగ కవిచక్రవర్తి జాషువా. తెలుగు సాహిత్యాన్ని నూతన మార్గం లోకి తీసుకువెళ్లి సనాతన సాంప్రదాయ మూసను బద్దలు కొట్టటానికి ఆద్యుడయ్యాడు. గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబర్ 28న జన్మించిన జాషువా కందుకూరి వీరేశ లింగం, తిరుపతి వెంకట కవుల ప్రోత్సాహంతో అద్భుతమైన కావ్య సష్టి చేశారు ..
గబ్బిలం, పిరదౌసి, స్వయంవరం, క్రీస్తు చరిత, ముషాపరులు, నా కథ, నాగార్జున సాగర్, బాపూజీ, స్వప్న కథ, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, గిజిగాడు, నేతాజీ, కొత్తలోకం మొదలగు రచనలతో అపూర్వ ముద్ర వేసాడు
''అక్షయంబైన మాత క్షీర మధు ధారలు అన్నంబుగా తెచ్చుకున్న అతిధి'' పాపాయి అనే కావ్యంలోనిది ఈ వాక్యం. అప్పుడే పుట్టిన బిడ్డ ఈ లోకంలోకి వచ్చేటప్పుడు తనతో పాటుగా ఏమి తెచుకుంటాడో తెలుపుతూ ఒక రమణీయ దశ్య కావ్యాన్ని మన కనుల ముందు దర్శింపచేస్తాడు. తల్లిబిడ్డల అనుబంధం గురించి చెబుతూ భావా లకు అందని ప్రపంచాన్ని సష్ట్టించాడు జాషువా.
''అమతము విషమును వ్యత్యాసమెరుగకా స్వాదింప చేను వెర్రి బాగులవాడు'' అంటూ బాల్యం ఎంత నిష్కల్మషమైనదో తానూ హదయమందు అనుభవించి అక్షర రూపం ఇచ్చి మనల్ని సమ్మోహితులను చేసిన కవి జాషువా వివాహ ములు పేరిట, పండుగల పేరిట, కర్మకాండల పేరిట ఆర్బాటంగా లక్షలు ఖర్చు పెట్టె సమాజాన్ని తీవ్రంగా నిరసించాడు జాషువా.
''ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుఃఖితమతులైన పేదల ఫకీరు లా సూన్యములైన పాత్రల మెతుకు విదల్ప డీ భారత మేదిని ముప్పది మూడు కోట్ల దేవతలెగ వడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులాఱునే ...'' గబ్బిలం.
లక్షలాది ధనంతో దేవుని పెళ్లిళ్లు చేసే ఈ భూమిలో పేద బీద వారి కడుపు నింపటానికి ఒక మెతుకు కూడా విద ల్చని కఠినాత్ములపై తీవ్రం గా విరుచుకు పడ్డాడు జాషువా అన్నార్తుల, పీడితుల వేదనను శివునికి చేరవేయటానికి ''గబ్బిలం'' ద్వారా సందేశం పంపుతూ
''ఆలయంబున నీవు వ్రేలాడు వేళ
శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేని వేళ
విన్నవింపుము నాడు జీవిత చరిత్ర''
పూజారి లేని సమయంలో పరమేశ్వరుని చెవిలో లోకంలో జరుగుతున్నా అక్రమాలు, అన్యాయాలు, ప్రజలు పడుతున్న అగచాట్లు గురించి చెప్పమని ''గబ్బిలాన్ని'' కోరుతున్న సందర్భం ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి దశ్య కావ్యంగా చూపించాడు. గబ్బిలాన్ని పక్షి రాణి అనటంలో జాషువా ప్రాచీన- సాహిత్య వాసనలను ఎంతగా నిరసించాడో అర్ధమవుతుంది
కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి
పంజరానా గట్టువడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు, విశ్వనరుడ నేను
కులమత దురహం కారాలపై, కులాంతర వివాహాలపై 18 దశకంలోనే స్పష్టమైన దక్పధాన్ని కలిగి విలువైన రచనలు చేసి తానూ ఆచరించి చూపిన సామాజిక వేత్త జాషువా ..
జాతీయోద్యమ కాలంలో అప్పటి కవులు పురాణ, ఇతిహాసాలలో వ్యక్తులను, సంఘటనల ఆధారంగా చేసుకుని అరుంధతి సుతుడుని, కష్ట జీవుల్ని నాయకులుగా చేసుకుని రచనలు చేశారు
తనను తానూ ఏ జాడ్యం, వికారం అంటని విశ్వనరునిగా ప్రకటించుకున్న ఈ మహాకవి సాహిత్య రంగంలో చేయని ప్రయోగం లేదు. అన్ని ప్రక్రియలలో సాధికారత ఉన్న జాషువా ఏ కవి సశించని వస్తువులను కావ్యాలుగా పద్యాలుగా మలచారు. ఆయన కవిత్వంలో కేవలం అన్యాయాన్ని ప్రతిఘటించాలనే భావనే కానీ ఎవరి మీద కసి ద్వేషం కనిపించదు. సున్నిత హదయుడైన కవి కాబట్టే తాను ఎన్ని అవమానాలు పొందినా తెలుగు సాహిత్యపు ఔన్నత్యాన్ని దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలిగించ లేదు.
''ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్'' అంటూ కాటి కాపరి జీవితాన్ని అతని హదయ కుహరాలలో తీవ్రంగా చెలరేగే భావ పరంపరను బహిర్గత పరుస్తూ జాషువా ''హరిశ్చంద్ర'' నాటకంలో రాసిన పద్యాలు కవిలోకంలో రారాజుగా నిలబెట్టాయి.
ఇక్కడ కూడా కాటికాపరి ఒక మనిషేనని అతని హదయం చేతన మహౌన్నతమని వేదాంత భవనాల్లో అతనికి ఎవరూ సాటి రారని స్పష్టం చేశారు.
మరణం సర్వ సాధారణమని ఎవరైనా మట్టిలో కలవక తప్పనప్పుడు అహంకారం, స్వార్ధం ఎందుకని ప్రశ్నించాడు.
సామాజిక అంతరాలపై నిరాఘాటంగా పోరాడి తన రచనల ద్వారా ప్రచండాగ్నిగా చెలరేగిన జాషువా తానూ కళలుకన్న భారతావని దశ్యాలను మనకు వారసత్వంగా అందించిన దేశ భక్తుడు.
శతాబ్దాల భారతీయ సాహిత్యంలో విలక్షణ కవిగా జాషువాని అభివర్ణించివచ్చు. ఆయన నిరంతరం దేశ పరిస్థితులు, సమాజం, ప్రజలు, అసమానతలు అనేకాంశాల చుట్టూ పరిభ్రమించిన సామాజిక వేత్త, తత్వవేత్త, మహాకవి.
అరుదయిన భావాలతో, అసమాన కవితా ధార్తో ప్రజా సాహిత్యం సష్ట్టించిన పద్మ భూషణ్, నవయుగ కవితా చక్రవర్తి, మహా కవి జాషువా నిత్య స్మరణీయుడు ..
- అట్లూరి వెంకట రమణ
9550776152