Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరతరాలుగా సామాన్య ప్రజానీకం పోగు చేసిన పద బంధాల సామాజిక అనుబంధాల పుస్తకంగా వస్తే అదే 'ఊరి దస్తూరి'. ఈ తరంలో చాలామందికి తెలియని అనేక సాంస్రృతిక వారసత్వ సంపద అందులో ఉంది. అంతకు మించి మనలో చాలా మందిమి ఆలోచించని లోతయిన విషయ విశ్లేషణ ఉంది. తెలంగాణా గ్రామీణ భాషలో నుంచి అంతరించిపోతున్న మమకారాలు, నుడికారాలు ఉన్నాయి. అందుకే ఈ పుస్తకానికి 'తెలంగాణా సాంస్కతిక చిత్రణ' అనే టాగ్-లైన్ కూడా ఇచ్చారు. నిజానికి ఇవి సంక్షిప్త సామాజిక సంభాషణలు. పల్లె చుట్టూ, పల్లె పదాల చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల విశ్లేషణలు. పల్లె పాదాలను జల్లెడ పట్టి అందులోని నిగూడమైన విలువలను ఏర్చి కూర్చిన 'ఊరి దస్తూరి' దేవేందర్కు అభినందనలు.
అన్నవరం దేవేందర్ నాకు చిరకాల మిత్రుడు. దాదాపు మూడున్నర దశాబ్దాల ముందర మా అక్షరాభ్యాసం 'జీవగడ్డ' దినపత్రికలో జరిగింది. హుస్నాబాద్ దగ్గర పోతారం (ఎస్) అనే చిన్న పల్లెటూరు నుంచి పచ్చిన దేవేందర్ జీపగడ్డకు హుస్నాబాద్ ప్రాంతం నుంచి వార్తలు మోసుకు వచ్చేవాడు. ఆయన రాతల నిండా ఊరి ముచ్చట్లే ఉండేవి, అప్పటికి కరువు ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ వెనుకబాటు వెతలే ఉండేవి. రైతులు, కూలీలు, వత్తి పనివాళ్ళు చివరకు బతుకుపోరులో చితికిపోయిన గంగిరెడ్ల వారి కథలు వ్యథలే వార్తలుగా మలిచేవాడు. నిజానికి దేవేందర్ కన్నీళ్లు తెలిసినవాడు, కష్టాలు చూసిన వాడు. అందుకే ఇప్పుడొక గొప్ప కవి కాగలిగాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిర, సముచిత స్థానం సంపాదించు కున్నాడు, ఆధునిక జీవితం నుంచి గతంలోకి వెళ్లి, బతికిన క్షణాలను తనివితీరా తడిమి చూసుకునే అచ్చ తెలంగాణా ఆత్మ దేవేందర్. అందుకే అతను ఏది రాసినా హదయానికి హత్తుకునేలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ దస్తూరి కూడా అలాంటిదే.
దస్తూరి అంటే చేతిరాత, చేతిరాత మనిషి స్వభావాన్ని చెపుతుందని అంటారు. దీనికోసం ఫాలజీ అనే ఒక శాస్త్రమే అభివద్ధి చెంది ఉంది. మనిషి చేతి రాతను బట్టి మనో విశ్లేషణను కూడా చెప్పే వారున్నారు. దేవేందర్ ఈ ఊరి దస్తూరి ద్వారా తెలంగాణా గ్రామీణ సమాజ స్వభావ విశ్లేషణ చేశారు. చిన్న చిన్న పదబంధాలు వివరిస్తూ గ్రామీణ మానవ సంబంధాలను, సామాజిక అనుబంధాలను విశదీకరించే ప్రయత్నం చేశారు. దేవేందర్ మొదటి నుంచీ చేస్తున్నది అదే! సాధారణంగా మొదటితరం రచయితలంతా చేసేది ఇదే. ఆధునిక జీవితంలోని ఉక్కపోత చాలామంది రచయితలను, కపులను పల్లెలను కలవరించేలా చేస్తుంది, ఆధునిక సాహిత్య చరిత్ర, సాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఆవిర్భవించిన కాలాలను, అప్పటి సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమౌతుంది. యూరప్ లో కథ, నవల, నాటకం, కవిత్వం, చిత్రలేఖనం ఇంతలా సజన అంతా ఇటువంటి ఉక్కపోత నుంచే మొదలయ్యింది. 17-18 వ శతాబ్దాల్లో యూరప్ గ్రామాల్లో సంభవించిన సామాజిక మార్పులు ఫ్యూడల్ దశ నుంచి పారిశ్రామిక దశకు సమాజం మారిన క్రమంలో ఎదుర్కొన్న సంక్షోభాలు కొత్త సజనకు కారణాలయ్యాయి. లిఖిత సాహిత్యానికంటే పూర్వం ఉన్న మౌఖిక సాహిత్యమంతా ఊరి సంగతులతోనే నిండి ఉండేది. మానవ నాగరికతలో జీవితం క్లిష్టమవుతూ ఒకదశ నుంచి మరోదశకు చేరుతున్న ప్రతి సందర్భంలో ఈ ఉక్కపోత ఉంటుంది. అదే కళల్లో ప్రతిఫలిస్తుంటుంది. దేవేందర్ ప్రభుత్వోద్యోగంలో ఉండి, ఆధునిక జీవితాన్ని గడుపుతున్నా ఇంకా ఆయన మనసు పల్లెల చుట్టూ తిరగటానికి, గతంలోకెళ్ళి ఎదో వెతకడానికి ప్రధానమైన కారణం ఆధునికత మీద ఉన్న అసంతప్తి.
ఇందులో తెలంగాణా ఊరి అనుబంధాలను అల్లిన కొన్ని పదబంధాలున్నాయి. తెలంగాణా గ్రామీణ సమాజంలో నిరంతరం వాడుకలో ఉండే కొన్ని పలుకుబడులు వాటి పూర్వాపర విశ్లేషణలు ఉన్నాయి. కొన్నిచోట్ల వాటి మూలాలు, వ్యుత్పత్తి వ్యవహారాలూ, సమయ, సందర్భ వివరణ పాటు వాటి సామాజిక ప్రాధాన్యత కూడా వివరించడం జరిగింది. అలాగే జాతీయాలు, సామెతలు, వాడుకలో ఉండే మిగితా భాషాపరమైన అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. గ్రామీణ భాషా సంస్రృతికి, ముఖ్యంగా కరీంనగర్ జానపద జన జీవనంలో నానుతున్న అనేక అంశాలను ఇందులో పొందు పరచడం జరిగింది. ఈ పొట్టి వ్యాసాలను వాటి విషయం స్వభావాన్ని బట్టి వేరువేరుగా కూర్చనప్పటికీ ఇందులో గ్రామీణ సంస్రృతికి ప్రతీకలుగా నిలిచే పలు అంశాలు స్పష్టంగా ఉన్నాయి. అందులో ఒకటి ఇసిరెలు. నిజానికి తెలంగాణా భాషా వైవిధ్యత గొప్పదనం ఏమిటంటే వాడుకలో ఉన్న, వాడుకలో లేని అనేక వస్తువులు, ఇసిరెలు, పరికరాలు వాటి విశిష్ట నామాలు సజీవంగా ఉండడం. పైగా అవి ప్రత్యేకమైనవై ఉండడం. తెలంగాణా సమాజంలోని కుల, ఉత్పత్తిపరమైన భిన్నత్వానికి ఇదొక ప్రతిరూపం. ఇక్కడ అనేక వత్తులు సజీవంగా ఉండడం కూడా ఒక కారణం. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, నేత, గౌడ ఇలా అన్ని వత్తి సమూహాలకు, కులాలకు అనేక పరికరాలు కపుల భాషలో చెప్పాలంటే సహస్ర వత్తుల సమస్త పరికరాలకు ప్రత్యేకమైన పని, పద జాలం (పేరు) ఉన్నాయి. అవి ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడి నాగరికత వికాసక్రమంలో వాటి పాత్ర, ఇక్కడి సామాజిక జీవితాన్ని సుసంపన్నం చేయడంలో వాటి ఉపయోగం ఎంతో ఉంది. అందుకే వాటిని 'పనిముట్లు', 'ఉపకరణాలు' అన్నారు. తాంబాలం, గంగాళం గురించి, శాడటాయి, మోటబాయి, గిరుక, బొక్కెన లాంటి పదాలు ఇప్పుడు పల్లెల్లో వినిపించవు. మంచినీటికి నల్లాలు, వ్యవసాయానికి ట్రాక్టర్లు, కరెంటు మోటార్లు, ప్రాజెక్టుల నీళ్లు కాలువలు వచ్చిన తరువాత ఇవి కనుమరుగై పోయాయి. ఈ పదాలు కూడా క్రమ క్రమంగా మాయమై పోయాయి. అలాగే కుమ్మరి కుండలు తయారు చేస్తాడని తెలిసినా ఆ కుండ సైజును బట్టి, దాని ఉపయోగాన్ని, వాడుకను బట్టి ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ పాత్రను వాడే కులాన్ని బట్టి కూడా దాని పేరు మారుతుంటుంది. దానికొక ప్రత్యేకమైన పేరుండేది. పట్వ, ముంత, బింకి, కుండ, గురిగి ఇట్లా అనేక రకాల మట్టి పాత్రల గురించి దేవేందర్ ఇందులో వివరిం చడం జరిగింది. ఇక రెండోది ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దే, లేదా ప్రభావితం చేసే ఆచారాలు, సాంప్రదాయాలు విలువల గురించిన విశ్లేషణ కూడా బాగుంది. నిజానికి ఒక సమాజపు సంస్కతికి ఇవి అద్దంపట్టే ప్రతీకలు. మనుషుల మధ్య అనుబంధ, బాంధవ్యాలు, పరస్పరం ఆధారపడి సాగించే జీవితంలో ఈ విలువలు దండలో దారంలాగా ఉంటాయి.
గ్రామాల్లో కులాల మధ్య అంతరాలు భౌతికంగా, నివాస ప్రాతాలు లేదా వాడలు విడివిడిగా స్పష్టంగానే ఉన్నా అందరినీ కలిపివుంచే పరస్పర ఆధార అవసరాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన అనుబంధాన్ని సున్నితంగా కొన్ని వ్యాసాల్లో వివరించడం జరిగింది. పండుగలు, పబ్బాలకు కలుసుకోవడం జాజిరికి, కాముని పున్నానికి, బతుకమ్మ పండగలకు లేదా జాతరలు, తీర్థాలకు పోయేటప్పుడు ప్రజల్లో ఉండే ఐక్యతకు ప్రతీకలుగా ఉండే ప్రవర్తనా రీతులను కూడా ఇందులో సంక్షిప్తంగా వివరించడం జరిగింది. నిజానికి గ్రామం అంటే కేవలం విడివిడిగా ఉండే ఇండ్లు, వాడలు, కులాలు మాత్రమే కాదు, అందులో అంతర్లీనంగా ఉండే మేము అనే భావన కూడా అంటాడు ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎం ఎన్ శ్రీనివాస్, భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలామంది సామాజిక పండితులు కలవరపడ్డారు. కులాల కుంపటిగా ఉన్న గ్రామాలు కుప్పకూలు తాయేమోనని భయపడ్డారు. కానీ ప్రతి కులమూ ఇంకోకులానికి లేదా ఊరికి అవసరమే కాబట్టి సామాజిక జీవనం సజావుగా సాగాలంటే షావుకారు నుంచి సఫాయి పనిచేసే వారి దాకా అందరూ ముఖ్యమే కాబట్టి ఎన్ని బేధాలున్న ఒకరి మీద ఒకరు ఆధారపడవలసి రావడం, ఉమ్మడి బతుకు తప్పు వేరే మార్గం లేకపోవడం, ఎవరికి వారు స్వతంత్రంగా ఉంటూనే సమిష్టిగా జీవించడం వల్ల పల్లెలే సమైక్యంగా నిలబడతాయనే నిర్ధారణకు వచ్చారు. దేవేందర్ చెప్పిన అంశాల్లో ఇదొకటి. అలాగే వ్యవసాయం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో పాతకాలపు వ్యవసాయ పద్ధతుల విశ్లేషణ బాగుంది. ఇట్లా చావు బతుకులు, సంప్రదాయాలు దానిచుట్టు అల్లుకున్న జీవితం మొత్తంగా ఈ పుస్తకం పాతకాలపు పల్లె సంస్కతికి అద్దం పడుతుంది.
అయినా గతకాలపు వివరాలున్న ఈ పుస్తకం ఇప్పుడు ఎందుకు అవసరం అనిపించవచ్చు. ఎప్పుడైనా గతకాలపు విలువలే చరిత్ర అవుతాయి. ఈ పుస్తకం తెలంగాణా భాషా పదకోశానికి, భాషాశాస్త్రానికి ఒక కూర్పు వంటిది. ఇది రేపు తెలంగాణా భాషా సంస్కతుల మీద పరిశోధన చేసేవారికి లేదా కనీసం వాటిని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవారికి పిల్లబాటగానైనా పనికొచ్చే పుస్తకం. తెలంగాణా ఉద్యమం చిక్కబడడానికి తెలంగాణా భాషపట్ల, సంస్కతిపట్ల చిన్న చూపు కూడా ప్రధాన కారణం. నిజానికి తెలంగాణా భాష పద సంపన్నమైనది. ఎందుకంటే తెలంగాణా సమాజం మిగితా సమాజాల లాగ ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం మాదిరిగా ఆధునీకరణ చెందలేదు. ఇక్కడ ఇంకా దేశీయ సంస్కతి సజీవంగా ఉంది. ముఖ్యంగా మతాలు, దేవతలు, ఆరాధనా పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కులాలు, వత్తి సముదాయాలు వాటి ప్రభావం అంతో ఇంతో ఉంది. అంటే తెలంగాణాకు తనదైన ప్రజా సంస్కతి ఉంది. 'సంస్కతి అంటే మానవ జీవితంలో ఉండే జ్ఞానం, విశ్వాసాలు, ప్రవర్తనల ఆధారంగా సమకూరిన విజ్ఞానాన్ని భావితరాలకు తెలియజేయడం'. ఇది భాష, ఆలోచనల పరంపర తో పాటు విశ్వాసాలు, ఆచారాలు, కట్టుబాట్లు, పనిముట్లు, పద్ధతులు, కళలు, సంప్రదాయాల్లో మిళితమై ఉంటుంది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఈ అంశాల మీద పూర్తి దష్టితో రావాల్సినన్ని పరిశోధనలు, పుస్తకాలు రాలేదు. ఇప్పటికైనా తెలంగాణా భాషా పదకోశాలు, సాంస్కతిక విశేషాలకు అద్దంపట్టే సంకలనాలు రావలసిన అవసరం ఉంది. గ్రామీణ జనబాహుళ్యంలో ఒకప్పుడు కీలక భూమిక పోషించి, ఇప్పుడు అడుగంటి పోయిన సాంస్కతిక ప్రతీకలను పాతాళ గరిగె వేసి వెతికి పట్టుకున్నాడు దేవేందర్. వాటిని చిత్రిక పట్టిన ఈ చిన్న పుస్తకం తెలంగాణా భాషా సాంస్కతిక పునరుజ్జీవనానికి ఒక పిల్లబాటగా ఉపయోగ పడుతుందనడంలో సందేహం లేదు.
- ఆచార్య ఘంటా చక్రపాణి